Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో వెలుగు చూసిన కొత్త రకం పోలియో వైరస్!

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (18:51 IST)
భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కానీ, ఇపుడు పోలియో వైరస్ వెలుగు చూసింది. పోలియో రహతి దేశంగా గత 2014లో ప్రకటించారు. అప్పటి నుంచి మన దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు. తాజాగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో పోలియో కొత్త వైరస్‌ను గుర్తించినట్టు బెంగాల్ ఆరోగ్య శాఖను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించింది. యూనిసెఫ్ నిర్వహించిన అధ్యయనంలో పోలియో వైరస్ రూపాంతరం వెలుగు చూసినట్టు సమాచారం. 
 
బెంగాల్ రాష్ట్రంలోని హౌరాలో 2011లో 12 యేళ్ళ బాలికకు పోలియో వైరస్ సోకింది. ఆ తర్వాత యునిసెఫ్‌తో కలిసి ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన అధ్యయనాల్లో ఈ వైరస్ రూపాంతరం చెందినట్టు తెలింది. దీంతో అన్ని వైద్య కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రులను అప్రమత్తం చేసింది. 
 
నిజానికి కోల్‌కతా, ముంబై వంటి మురికివాడల్లో ఇటువంటి అధ్యయనాలు జరుగుతూ ఉంటాయి. ఇపుడు కోల్‌కతాలోని మెటియాబురుజ్ ప్రాంతంలోని మురికివాడలో ఈ వైరస్ రూపాంతరం కనిపించడంతో, బహిరంగ మల, మూత్ర విసర్జన చేయరాదని ఈ ప్రాంతవాసులను ఆదేశించారు. 
 
వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న బాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అన్ని ప్రభుత్వాసుపత్రులు, వైద్య కళాశాలలకు ఆదేశాలు ఇచ్చారు. టీకాకరణపై కూడా దృష్టి సారించాలని ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments