భారత్‌లో వెలుగు చూసిన కొత్త రకం పోలియో వైరస్!

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (18:51 IST)
భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కానీ, ఇపుడు పోలియో వైరస్ వెలుగు చూసింది. పోలియో రహతి దేశంగా గత 2014లో ప్రకటించారు. అప్పటి నుంచి మన దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు. తాజాగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో పోలియో కొత్త వైరస్‌ను గుర్తించినట్టు బెంగాల్ ఆరోగ్య శాఖను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించింది. యూనిసెఫ్ నిర్వహించిన అధ్యయనంలో పోలియో వైరస్ రూపాంతరం వెలుగు చూసినట్టు సమాచారం. 
 
బెంగాల్ రాష్ట్రంలోని హౌరాలో 2011లో 12 యేళ్ళ బాలికకు పోలియో వైరస్ సోకింది. ఆ తర్వాత యునిసెఫ్‌తో కలిసి ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన అధ్యయనాల్లో ఈ వైరస్ రూపాంతరం చెందినట్టు తెలింది. దీంతో అన్ని వైద్య కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రులను అప్రమత్తం చేసింది. 
 
నిజానికి కోల్‌కతా, ముంబై వంటి మురికివాడల్లో ఇటువంటి అధ్యయనాలు జరుగుతూ ఉంటాయి. ఇపుడు కోల్‌కతాలోని మెటియాబురుజ్ ప్రాంతంలోని మురికివాడలో ఈ వైరస్ రూపాంతరం కనిపించడంతో, బహిరంగ మల, మూత్ర విసర్జన చేయరాదని ఈ ప్రాంతవాసులను ఆదేశించారు. 
 
వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న బాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అన్ని ప్రభుత్వాసుపత్రులు, వైద్య కళాశాలలకు ఆదేశాలు ఇచ్చారు. టీకాకరణపై కూడా దృష్టి సారించాలని ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments