Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో వెలుగు చూసిన కొత్త రకం పోలియో వైరస్!

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (18:51 IST)
భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కానీ, ఇపుడు పోలియో వైరస్ వెలుగు చూసింది. పోలియో రహతి దేశంగా గత 2014లో ప్రకటించారు. అప్పటి నుంచి మన దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు. తాజాగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో పోలియో కొత్త వైరస్‌ను గుర్తించినట్టు బెంగాల్ ఆరోగ్య శాఖను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించింది. యూనిసెఫ్ నిర్వహించిన అధ్యయనంలో పోలియో వైరస్ రూపాంతరం వెలుగు చూసినట్టు సమాచారం. 
 
బెంగాల్ రాష్ట్రంలోని హౌరాలో 2011లో 12 యేళ్ళ బాలికకు పోలియో వైరస్ సోకింది. ఆ తర్వాత యునిసెఫ్‌తో కలిసి ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన అధ్యయనాల్లో ఈ వైరస్ రూపాంతరం చెందినట్టు తెలింది. దీంతో అన్ని వైద్య కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రులను అప్రమత్తం చేసింది. 
 
నిజానికి కోల్‌కతా, ముంబై వంటి మురికివాడల్లో ఇటువంటి అధ్యయనాలు జరుగుతూ ఉంటాయి. ఇపుడు కోల్‌కతాలోని మెటియాబురుజ్ ప్రాంతంలోని మురికివాడలో ఈ వైరస్ రూపాంతరం కనిపించడంతో, బహిరంగ మల, మూత్ర విసర్జన చేయరాదని ఈ ప్రాంతవాసులను ఆదేశించారు. 
 
వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న బాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అన్ని ప్రభుత్వాసుపత్రులు, వైద్య కళాశాలలకు ఆదేశాలు ఇచ్చారు. టీకాకరణపై కూడా దృష్టి సారించాలని ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments