Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు నుంచి కిందకు దూకిన మహిళ, ఆ తర్వాత?

Webdunia
బుధవారం, 5 మే 2021 (14:51 IST)
తిరుపతి రైల్వేస్టేషన్లో మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. స్టేషన్లో ట్రైన్ ఆగకముందే దిగాలని ప్రయత్నం చేయడంతో కాలుజారి ట్రైన్‌కు మధ్యలో పడిపోయింది. అదే టైంలో ఫ్లాట్‌ఫాంపై విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సతీష్ చాకచక్యంగా ఆమెను బయటకు లాగాడు.
 
దీంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. గాజువాకకు చెందిన భార్యాభర్తలు తిరుమల శ్రీవారి దర్సనార్థం తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో నిన్న సాయంత్రం వైజాగ్ నుంచి బయలుదేరారు. ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో తిరుమల ఎక్స్‌ప్రెస్ తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది.
 
అయితే గాఢనిద్రలో ఉన్న భార్యాభర్తలు రైలు తిరుపతి రైల్వేస్టేషన్ లోని ఫ్లాట్ ఫాంపై ఉందన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. రైలు కదులుతుండగా ఉన్నట్లుండి మహిళకు మెలుకువ వచ్చింది. భర్తకు చెప్పి నిద్రలేపే లోపే రైలు కదిలింది. 
 
ఆతృతగా రైలు దిగేందుకు మహిళ ప్రయత్నించి చివరకు ఫ్లాట్‌ఫాం కింద పడిపోతుండగా విధుల్లో ఉన్న సతీష్ అనే రైల్వే పోలీసు చాకచక్యంగా ఆమె ప్రాణాలను కాపాడాడు. సతీష్‌ను రైల్వేశాఖ ఉన్నతాధికారులు అభినందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments