Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతిపితను చంపిన హిందూ మహాసభ కార్యకర్తలు... కేసు నమోదు

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (10:31 IST)
జాతిపిత మహాత్మా గాంధీ 71వ వర్థంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి దేశప్రజలంతా నివాళులు అర్పిస్తుంటారు. అలాంటి సమయంలో గాంధీని చంపిన హంతకుడు గాడ్సే మాతృసంస్థ అఖిల భారత హిందూ మహాసభ దిగజారుడు చర్యకు పాల్పపడింది. జాతిపిత హత్యా దృశ్యాన్ని పునఃసృష్టించింది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్‌లో, ఆ సంస్థ సభ్యులందరూ హర్షధ్వానాలు చేస్తుండగా.. హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజా శకున్‌ పాండే.. గాంధీజీ గడ్డిబొమ్మపై తుపాకీతో కాల్పులు జరిపారు. అక్కడున్నవారంతా 'మహాత్మా నాథూరాం గాడ్సే అమర్‌ రహే' అంటూ నినాదాలతో హోరెత్తించారు. గాంధీజీ గడ్డిబొమ్మను దహనం చేశారు. 
 
అనంతరం పూజా విలేకరులతో మాట్లాడారు. "గాంధీజీ హత్య ఘటనను పునఃసృష్టించడం ద్వారా మేమొక కొత్త సంప్రదాయానికి నాందిపలికాం. ఏటా దసరా రోజున రావణాసురుడి బొమ్మను దహనం చేసినట్టు.. ఇకముందూ ఇది కొనసాగుతుంది" అని చెప్పారు. గాంధీజీని హత్య చేసిన గాడ్సే హిందూ మహాసభ సభ్యుడే. గాడ్సే గౌరవార్థం ఆ సంస్థ ఏటా జనవరి 30ని 'శౌర్యదివస్‌'గా పాటిస్తోంది. 
 
మరోవైపు, సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో యూపీ పోలీసులు స్పందించారు. ఈ ఘటనలో 12 మంది హిందూమహాసభ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీ గడ్డిబొమ్మ దహనం కేసులో నలుగురిని గుర్తించామని, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని అలీఘడ్ ఏఎస్పీ నీరజ్ జడాన్ చెప్పారు. ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని ఏఎస్పీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments