శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోగానే ప్రశాంతం: పవన్ కళ్యాణ్

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (16:20 IST)
తిరుమల శ్రీవారిని జనసేనాని పవన్ కళ్యాణ్  దర్సించుకున్నారు. సాంప్రదాయ వస్త్ర ధారణలో స్వామివారి సేవలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జనసేనపార్టీకి చెందిన ముఖ్య నేతలతో కలిసి స్వామి వారిని దర్సించుకున్నారు. ముందుగా వైకుంఠం నుంచి ఆలయంలోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్ సాధారణ భక్తుడిలాగా స్వామిసేవలో పాల్గొన్నారు.
 
ఎలాంటి హడావిడి లేకుండా జనసేనాని ఆలయంలోకి వెళ్ళారు. టిటిడి అధికారులు పవన్ కళ్యాణ్‌కు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. ఆలయ దర్సనానంతరం వెలుపల మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎప్పుడో శ్రీవారిని దర్సించుకోవాలనుకున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు.
 
అయితే కరోనా కారణంగా స్వామివారిని దర్సించుకోలేకపోయానని చెప్పారు. స్వామివారిని దర్సించుకున్న తరువాత మనస్సుకు ప్రశాంతంగా ఉందన్నారు. తిరుమలలో ఎలాంటి రాజకీయాలు మాట్లాడనని చెప్పి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 
 
అయితే ఒక్కసారిగా పవన్ అభిమానులు ఆలయం ముందుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సిఎం పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. ఆలయం వద్ద గట్టిగా అరవొద్దని జనసేనాని అభిమానులకు నచ్చచెబుతూ మెల్లగా అక్కడి నుంచి కారు ఎక్కి వెళ్ళిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: నైజం హక్కులతో రామ్ చరణ్ కు పెద్ది చిత్రం మరో రచ్చ చేస్తుందా !

Rashmika Mandanna: గొండ్ తెగల నేపథ్యంతో రష్మిక మందన్న మైసా పోస్టర్

Mrunal Thakur: హ్యాండ్ బ్రేక్ లేని అంబెలెన్స్ తో చాలా రిస్కీ స్టంట్స్ చేశాను : మృణాల్ ఠాకూర్

Pradeep Ranganathan: ఏఐ వల్ల ఎన్ని ఇబ్బందులో.. 2040 నాటికి పరిస్థితి ఏమౌతుందో?

ప్రేమ అనేది సర్వస్వం కాదు.. కానీ అది లేకపోతే శూన్యం.. త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments