Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా కట్టుబడివున్నాం : జనసేన ప్రకటన

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రత్యేక హోదాకు ఇవ్వాలన్న డిమాండ్‌కు తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కట్టుబడివున్నారని జనసేన పార్టీ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇదే అంశంపై ఆ పార్టీ ఓ ప్రకటన చేసింది.

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (17:11 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రత్యేక హోదాకు ఇవ్వాలన్న డిమాండ్‌కు తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కట్టుబడివున్నారని జనసేన పార్టీ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇదే అంశంపై ఆ పార్టీ ఓ ప్రకటన చేసింది. హేతుబద్ధత లేని రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు చట్టంలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేర్చాలని పవన్‌కల్యాణ్‌ మరోమారు డిమాండ్‌ చేశారు. 
 
జాతీయ మీడియా ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యల్ని తప్పుగా అన్వయించారని మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి సున్నితమైన సమయంలో అభిప్రాయాలను ఎవరూ వక్రీకరించొద్దని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏది అవసరమో, ఏవి ఇస్తామని మాటిచ్చారో అవి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ప్రత్యేక హోదా, చట్టప్రకారం రావాల్సిన నిధుల విషయంలో తాను చెప్పిన మాటలను తప్పుగా అన్వయించారన్నారు. 
 
ప్రజలు, జనసేన కార్యకర్తలు ఈ విషయాన్ని ఇప్పటికే గుర్తించి అర్థం చేసుకున్నారన్నారు. రాష్ట్రానికి నిధులిస్తే సరిపోతుందని తానెప్పడూ చెప్పలేదని, మంగళవారం ప్రసారమైన ఇంటర్వ్యూలో ప్రత్యేక హోదా విషయంలో తాను చెప్పిన అభిప్రాయాలను పత్రికలు, ప్రసార మాధ్యమాలు వక్రీకరించాయని ఆ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments