Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర నుంచి ఆక్సిజన్ ప్లాంట్లు ప్రారంభిస్తా: సోనూ సూద్

Webdunia
శనివారం, 22 మే 2021 (19:55 IST)
తాను తలపెట్టిన ఆక్సిజన్​ ప్లాంట్ల ఏర్పాటును ఆంధ్రప్రదేశ్​ నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు సోనూసూద్. కర్నూలులో తొలి ప్రాధాన్యంగా ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
 
లాక్​డౌన్​ మొదలైనప్పటి నుంచి ఎంతోమందికి సాయం చేస్తున్న నటుడు సోనూసూద్​. తన ఆధ్వర్యంలోని తొలి సెట్​ ఆక్సిజన్​ ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్​లో ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.
 
 కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి, నెల్లూరు ఆత్మకూరులోని జిల్లా ఆస్పత్రిలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే మిగతా రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్​ ప్లాంట్లను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా తనను కోరిన ఎంతోమందికి ఆక్సిజన్​ కాన్సట్రేటర్​లను అందించారు సోనూసూద్.
 
 ఇవి సరిపోకపోవడం వల్ల విదేశాల నుంచి ఆక్సిజన్​ ప్లాంట్లను తెప్పించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే తొలి ప్రాధాన్యంగా ఆంధ్రప్రదేశ్​లో ఆక్సిజన్​ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments