Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ సమాధికి మోకరిల్లి సారీ చెబితే... రెబెల్ ఎమ్మెల్యేలకు పిలుపు

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (12:54 IST)
అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఆర్కే నగర్ ఎమ్మెల్యే, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వైపు ఉన్న 18 మంది అన్నాడీఎంకే అసంతృప్త ఎమ్మెల్యేలపై పడిన అనర్హత వేటును హైకోర్టు కూడా సమర్థించింది. 
 
ఈ నేపథ్యంలో ఈ మాజీ శాసనసభ్యులందరూ మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధివద్ద మోకరిల్లి క్షమాపణ చెబితే వారిని మళ్లీ పార్టీలో చేర్చుకుంటామని అన్నాడీఎంకే ప్రకటించింది. ఈ మేరకు  ఆ పార్టీ పత్రిక నమదు అమ్మాలో మాజీ శాసనసభ్యులంతా మళ్లీ పార్టీలో చేరాలని ఆహ్వానించింది. 
 
అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నాయకుడు దినకరన్‌ మినహా తక్కినవారినందరినీ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమేనని ఆ పార్టీ ప్రకటించిన మరుసటి రోజే మాజీ ఎమ్యెల్యేలను ఆహ్వానిస్తూ ఓ వ్యాసం ఆ పత్రికలో ప్రచురితమవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 
 
మాజీ శాసనసభ్యులు 18 మంది మెరీనాబీచ్‌లోని జయ సమాధివద్ద మోకరిల్లి క్షమాపణలు చెప్పుకుంటే భేషరతుగా వారిని మళ్లీ పార్టీలోకి చేర్చుకుంటామని అందులో పేర్కొంది. దీనిపై అన్నాడీఎంకే వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments