Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ సమాధికి మోకరిల్లి సారీ చెబితే... రెబెల్ ఎమ్మెల్యేలకు పిలుపు

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (12:54 IST)
అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఆర్కే నగర్ ఎమ్మెల్యే, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వైపు ఉన్న 18 మంది అన్నాడీఎంకే అసంతృప్త ఎమ్మెల్యేలపై పడిన అనర్హత వేటును హైకోర్టు కూడా సమర్థించింది. 
 
ఈ నేపథ్యంలో ఈ మాజీ శాసనసభ్యులందరూ మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధివద్ద మోకరిల్లి క్షమాపణ చెబితే వారిని మళ్లీ పార్టీలో చేర్చుకుంటామని అన్నాడీఎంకే ప్రకటించింది. ఈ మేరకు  ఆ పార్టీ పత్రిక నమదు అమ్మాలో మాజీ శాసనసభ్యులంతా మళ్లీ పార్టీలో చేరాలని ఆహ్వానించింది. 
 
అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నాయకుడు దినకరన్‌ మినహా తక్కినవారినందరినీ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమేనని ఆ పార్టీ ప్రకటించిన మరుసటి రోజే మాజీ ఎమ్యెల్యేలను ఆహ్వానిస్తూ ఓ వ్యాసం ఆ పత్రికలో ప్రచురితమవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 
 
మాజీ శాసనసభ్యులు 18 మంది మెరీనాబీచ్‌లోని జయ సమాధివద్ద మోకరిల్లి క్షమాపణలు చెప్పుకుంటే భేషరతుగా వారిని మళ్లీ పార్టీలోకి చేర్చుకుంటామని అందులో పేర్కొంది. దీనిపై అన్నాడీఎంకే వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments