పాడె మోసేందుకురాని ఆ నలుగురు.. సైకిల్‌పై శవాన్ని తరలించిన కుమారుడు

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (08:52 IST)
ఆధునిక సమాజంలో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. హైటెక్ యుగంలో కూడా కులాలు, మతాల, చిన్నాపెద్దా అనే తారతమ్యాలు తారా స్థాయిలోనే ఉన్నాయని మరోమారు నిరూపితమైంది. ఫలితంగా మనిషి జీవించివున్నపుడే కాదు.. చనిపోయిన తర్వాత కూడా దగ్గరకు రావడం లేదు. తాజాగా ఒడిషాలో తక్కువ కులానికి చెందిన ఓ మహిళ కన్నుమూసింది. ఆమె పాడె మోసేందుకు ఆ గ్రామానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో ఆ మహిళ కుమారుడే సైకిల్‌పై శవాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఒడిషా రాష్ట్రంలోని కర్పాబహాల్ గ్రామానికి చెందిన జాంకి సిన్హానియా (45) అనే మహిళకు భర్త చనిపోయాడు. ఈమె తన కుమారుడు సరోజ్ ‌(17)తో కలిసి ఉంటోంది. వీరిద్దరూ కూలీపని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల మంచి నీళ్ల కోసం బావి వద్దకు వెళ్లి అదుపు తప్పి అందులో పడి చనిపోయింది. 
 
దీంతో తన తల్లి అంత్యక్రియలకు సహకరించాలని సరోజ్‌ గ్రామస్తులను కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఒక్కడే తల్లి శవాన్ని సైకిల్‌‌పై తీసుకెళ్లి గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో ఖననం చేశాడు. అంత్యక్రియలకు సహకరించాలని గ్రామస్తులను వేడుకున్నప్పటికీ.. ఎవరూ ముందుకు రాలేదని సరోజ్‌ వాపోయాడు. తక్కువ కులానికి చెందిన వాళ్లమని గ్రామస్తులంతా తమను దూరం పెట్టారని కన్నీరుమున్నీరయ్యాడు. ఈ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments