Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సేమ్ సీన్' రిపీట్... లోక్‌సభ 37 సెకన్లకే... రాజ్యసభ రేపటికి వాయిదా

పార్లమెంట్ ఉభయ సభలు మరోమారువాయిదా పడ్డాయి. ప్రధాని మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం, వైకాపా పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించాలంటూ ఆ రెండు పార్టీలకు చెందిన ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కాన

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (11:33 IST)
పార్లమెంట్ ఉభయ సభలు మరోమారువాయిదా పడ్డాయి. ప్రధాని మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం, వైకాపా పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించాలంటూ ఆ రెండు పార్టీలకు చెందిన ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఉభయ సభల్లో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. 
 
దీనికి కారణంలేకపోలేదు. కావేరీ జలాల పంపిణీ కోసం కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే, రిజర్వేషన్ల పెంపుపై తెరాస ఎంపీలు ఆందోళనలకు దిగాయి. ఈ రెండు పార్టీలు వెల్‌లోకి దూసుకొచ్చి సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. దీంతో సభలో రభస చోటుచేసుకుంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంత వారించినా విపక్షాలు వినకపోవడంతో ఆమె సభ ప్రారంభమైన 37 సెకన్లకే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
 
మరోవైపు రాజ్యసభలోనూ ఇదే సీను చోటుచేసుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం సభలో విపక్ష అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌లు అందోళనలు చేపట్టాయి. సభా సజావుగా ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలించలేదంటూ రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభను ఏకంగా గురువారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. దీంతో తమ తదుపరి కార్యాచరణపై విపక్షాలు దృష్టి సారిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments