Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరీబియన్ దీవుల్లో ఆవాసం - కైలాస పేరిట రిజర్వు బ్యాంకు

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (14:17 IST)
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి సొంతంగా కైలాస పేరుతో ఓ రిజర్వు బ్యాంకును ఏర్పాటు చేశారు. అత్యాచార ఆరోపణలతో దేశ విడిచి పత్తాలేకుండాపారిపోయిన ఈయన ప్రస్తుతం కరేబియన్ దీవుల్లో తలదాచుకుంటున్నట్టు సమాచారం.
 
అక్కడ ఓ దీవిని సొంతం చేసుకుని దానికి 'కైలాస' అనే పేరు పెట్టి... ఓ దేశంగా ప్రకటించారు. తన దేశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ కైలాస' నెలకొల్పారు. రిజర్వ్ బ్యాంకు అన్న తర్వాత కరెన్సీ ఉండాలి కదా... దాంతో కైలాస దేశముద్రతో నోట్లు, నాణేలు కూడా విడుదల చేశారు. ఈ నాణేలు బంగారంతో తయారైనవని కైలాస దేశాధిపతి నిత్యానంద సెలవిచ్చారు.
 
ఇక, తమ రిజర్వ్ బ్యాంకు విధివిధానాలను కూడా ఆయన వివరించారు. ఏ దేశానికి చెందిన కరెన్సీ అయినా కైలాస దేశంలో చెల్లుబాటు అవుతుందని, తమ కైలాస కరెన్సీ కూడా అన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుందన్నారు. ఈ మేరకు అనేక దేశాల బ్యాంకులతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఇందులో ఎంతమాత్రం వాస్తవం ఉందనేది భవిష్యత్తులో తేలనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments