భారత్‌ను కరోనా వీడిపోవాలంటే.. అది జరగాలి.. నిత్యానంద

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (16:08 IST)
భారత్‌ను కరోనా ఎప్పుడు వీడిపోతుందనే దానిపై ఇంకా వైద్యులకే క్లారిటీ లేదు అయితే తనకు తాను దేవుడిలా ఫీలైపోయే... స్వామిని అని చెప్పుకునే వివాదాస్పద స్వామి నిత్యానంద ఈ ప్రశ్నకు ఏ ఆన్సర్ ఇస్తాడన్నది ఆసక్తికరం. అత్యుత్సాహం కొద్దీ ఓ భక్తుడు అడగనే అడిగాడు. 
 
స్వామీ ఇండియాలో కరోనా ఎప్పుడు పోతుంది అని... దానికి వీడియో చాటింగ్‌లో నిత్యానంద చిన్నగా నవ్వి... ఎలా పోతుంది... నేను రాకుండా.... నేను వస్తేనే కరోనా పోతుంది... అన్నాడు. తన శరీరంలో అమ్మా దేవి ప్రవేశించిందన్న నిత్యానంద... తాను ఇండియాలో కాలు పెడితే... కరోనా పోతుందని అన్నాడు. అది విని షాకవ్వడం మిగతా భక్తుల వంతైంది.
 
నిత్యానందపై లైంగిక వేధింపుల ఆరోపణలతోపాటూ... చాలా కేసులు ఉన్నాయి. ఈ వివాదాస్పద స్వామి... ఇండియా నుంచి ఈక్వెడార్ వెళ్లి... అక్కడ కైలాస అనే కింగ్‌డమ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఓ చిన్న దీవిని కొనేసి... దాన్నే స్వయంగా ఓ దేశంగా ప్రకటించాడు.
 
అక్కడో కరెన్సీ కూడా సెట్ చేశాడు. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ రావడంతో... ఇండియా నుంచి ఈక్వెడార్ వెళ్లేందుకు ఆ దేశంలో అనుమతి లేదు. దాంతో... నిత్యానంద కైలాసానికి భక్తులు రావట్లేదు. అందుకే నిత్యానంద వీడియో రూపంలో ఎంట్రీ ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చిరంజీవి గారి సలహా స్పూర్తి,. బుచ్చిబాబు వల్ల చేతికి గాయం : రామ్ చరణ్

Sudheer Anand: సుడిగాలి సుధీర్ ఇకపై సుధీర్ ఆనంద్ గా హై లెస్సో చిత్రంతో రాబోతున్నాడు

Dragon Glimpse: డ్రాగన్ గ్లింప్స్ లో ఉన్మాదంతో ఎన్.టి.ఆర్. జీవించాడంటున్న అభిమానులు

త్రిష కృష్ణన్‌ బ్యూటీ సీక్రెట్ అదే.. చీరలంటే ఆమెకు చాలా ఇష్టం

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

తర్వాతి కథనం