భారత్‌ను కరోనా వీడిపోవాలంటే.. అది జరగాలి.. నిత్యానంద

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (16:08 IST)
భారత్‌ను కరోనా ఎప్పుడు వీడిపోతుందనే దానిపై ఇంకా వైద్యులకే క్లారిటీ లేదు అయితే తనకు తాను దేవుడిలా ఫీలైపోయే... స్వామిని అని చెప్పుకునే వివాదాస్పద స్వామి నిత్యానంద ఈ ప్రశ్నకు ఏ ఆన్సర్ ఇస్తాడన్నది ఆసక్తికరం. అత్యుత్సాహం కొద్దీ ఓ భక్తుడు అడగనే అడిగాడు. 
 
స్వామీ ఇండియాలో కరోనా ఎప్పుడు పోతుంది అని... దానికి వీడియో చాటింగ్‌లో నిత్యానంద చిన్నగా నవ్వి... ఎలా పోతుంది... నేను రాకుండా.... నేను వస్తేనే కరోనా పోతుంది... అన్నాడు. తన శరీరంలో అమ్మా దేవి ప్రవేశించిందన్న నిత్యానంద... తాను ఇండియాలో కాలు పెడితే... కరోనా పోతుందని అన్నాడు. అది విని షాకవ్వడం మిగతా భక్తుల వంతైంది.
 
నిత్యానందపై లైంగిక వేధింపుల ఆరోపణలతోపాటూ... చాలా కేసులు ఉన్నాయి. ఈ వివాదాస్పద స్వామి... ఇండియా నుంచి ఈక్వెడార్ వెళ్లి... అక్కడ కైలాస అనే కింగ్‌డమ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఓ చిన్న దీవిని కొనేసి... దాన్నే స్వయంగా ఓ దేశంగా ప్రకటించాడు.
 
అక్కడో కరెన్సీ కూడా సెట్ చేశాడు. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ రావడంతో... ఇండియా నుంచి ఈక్వెడార్ వెళ్లేందుకు ఆ దేశంలో అనుమతి లేదు. దాంతో... నిత్యానంద కైలాసానికి భక్తులు రావట్లేదు. అందుకే నిత్యానంద వీడియో రూపంలో ఎంట్రీ ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం