Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషుల ఉరి అమలును ప్రత్యక్ష ప్రసారం చేయాలి : సుప్రీంలో పిల్

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (14:41 IST)
నిర్భయ అత్యాచార కేసులో దోషులకు అమలు చేసే ఉరిశిక్షలను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అంతేకాకుండా, అమెరికాలో ఉన్న తరహాలోనే ఈ కామాంధులను మృతురాలు నిర్భయ తల్లిదండ్రుల సమక్షంలోనే ఉరితీయాలని పిటిషనర్ కోరారు. 
 
కాగా, నిర్భయ కేసు దోషుల ఉరిశిక్షకు కౌంట్‌‌డౌన్ మొదలైంది. అధికారుల నుంచి ఫలానా రోజు ఉరి తీస్తున్నామని అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ తలారి కోసం వెతుకులాట, ఉరి తాళ్లను సిద్దం చెయ్యడం వంటి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని త్వరలోనే మరణ శిక్ష ఖాయమనే ప్రచారం రోజురోజుకూ సాగుతోంది. 
 
కాకపోతే ఉరిని అమలు చేసే విషయంలో మరికొన్ని రోజులు జాప్యం జరిగేలా కనిపిస్తుంది. దోషిగా నిర్థారించబడిన అక్షయ్, ఉరిశిక్షపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17వ తేదీన ఈ పిల్‌పై వాదనలు జరగనున్నాయి. మిగిలిన ముగ్గురు దోషులు.. పవన్ గుప్తా, ముకేశ్, వినయ్ శర్మ గతంలోనే రివ్యూ పిల్స్ దాఖలు చేయగా వాటిని సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: కాంతార చాప్టర్‌ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments