Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ.. బంకర్‌లో దాక్కున్నా లాక్కొచ్చి బాదుతాం : బాలయ్య ఫైర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ప్రధాని మోడీపై బాలయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయ

Webdunia
శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (16:01 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ప్రధాని మోడీపై బాలయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన నువ్వు ఒక ద్రోహివి... నిన్ను కొట్టి కొట్టి తరుముతామని, బంకర్‌లో దాక్కున్నా లాక్కొచ్చి బాదుతామంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకప్పుడు బీజేపీకి రెండు సీట్లు ఉండేవని... వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని బాలయ్య జోస్యం చెప్పారు.
 
ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని దేశానికి తెలియజేసేలా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పుట్టిన రోజైన శుక్రవారం (ఏప్రిల్ 20) ధర్మపోరాట దీక్షను విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో తలపెట్టిన విషయం తెల్సిందే. ఈ దీక్షకు బాలకృష్ణ తన సంఘీభావాన్ని తెలుపుతూ నరేంద్ర మోడీపై మండిపడ్డారు. 
 
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, ఎవరెవరినో అడ్డం పెట్టుకుని వ్యవహారాలని నడిపిస్తున్నావ్.. ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించారు. చిల్లర రాజకీయాలు, కుప్పిగంతులు మానేయాని మోడీకి బాలయ్య సూచించారు. అమరావతి శంకుస్థాపనకు మట్టి, పవిత్ర జలాలను మోడీ తీసుకురావడం గురించి మాట్లాడుతూ... మా దగ్గర మట్టి, నీళ్లు లేవా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రతి ఆంధ్రుడు ఒక్కో 'గౌతమీపుత్ర శాతకర్ణి'లా మోడీపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీని ఉద్ధరించే శక్తి కేవలం చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments