మీడియా వల్లే ప్రజారాజ్యం కొంప మునిగిపోయింది.. నాగబాబు

Webdunia
ఆదివారం, 12 మే 2019 (14:53 IST)
మీడియా, సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మీడియా ఒక్కటే ప్రపంచంలో జరుగుతుందనేది ప్రజలకు ఇట్టే తెలియజేస్తుంది. మీడియా మంచి విషయాలను ప్రజలకు చేరవేస్తున్నాయి. కానీ కొన్ని మీడియా ఛానల్స్ ఎల్లో జర్నలిజానికి పాల్పడుతున్నాయనే వాదన వుంది. తాజాగా మీడియాపై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు. 
 
అస‌లే ఇప్పుడు టీవీ 9 ర‌విప్ర‌కాశ్ ఇష్యూతో మీడియాపై ప్ర‌జ‌ల్లో కూడా మంచి చ‌ర్చ జ‌రుగుతుంది. ఇలాంటి స‌మ‌యంలో నాగ‌బాబు కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. తమ కుటుంబానికి మీడియా చేసినంత అన్యాయం.. దుర్మార్గం ఇంకెవ‌రూ చేయ‌లేద‌ని చెప్పాడు. 
 
ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు చిరంజీవి రేంజ్ వేరు.. కానీ పార్టీ పెట్టిన త‌ర్వాత ఆయ‌న ప‌రిస్థితికి కార‌ణం మీడియా అని మీరు భావిస్తున్నారా అని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా నాగ‌బాబు ఇలాంటి వ్యాఖ్య‌లు చేశారు.

అప్ప‌ట్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండింటికి వ‌త్తాసు ప‌లికే ఛానెల్స్ ఉండ‌టం.. కావాల‌నే చిరంజీవిపై దుర్మార్గం చేయ‌డంతోనే ఆయ‌న‌కు ఆ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని నాగబాబు తెలిపాడు. గ‌తంలో కూడా చిరుకు మీడియా స‌పోర్ట్ లేదు కాబ‌ట్టే రాజ‌కీయాల్లో ప్ర‌భావం చూపించ‌లేక‌పోయార‌ని నాగబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

నారీ నారీ నడుమ మురారి టికెట్లు ఎంఆర్‌పీ ధరలకే : నిర్మాత అనిల్ సుంకర

మీకే చెప్పేది, మా ఇద్దర్నీ వీడియో తీయొద్దు: ఫోటోగ్రాఫర్లపై కృతి సనన్ ఆగ్రహం

Maruti: రాజా సాబ్ గా ప్రభాస్ ని కొత్తగా చూపించాననే ప్రశంసలు వస్తున్నాయి : మారుతి

సుమతీ శతకం నుండి అమర్దీప్ చౌదరి డాన్స్ తో తొలి సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

తర్వాతి కథనం
Show comments