Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాసలీలల వీడియోలను రూ.30 కోట్లకు బేరం పెట్టిన కిలేడీలు

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (14:23 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూసిన హనీట్రాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వలపు వల విసిరిన అమ్మాయిలు.. పలువురు రాజకీయ నేతలను, బ్యూరోక్రాట్లను ముగ్గులోకి దించారు. వారికి అందమైన అమ్మాయిలను పంపి.. రహస్యంగా వీడియోలు చిత్రీకరించారు. ఆ తర్వాత వాటిని ఆయా రాజకీయ నేతల ప్రత్యర్థులకు విషయం చేరవేసి బేరం పెట్టారు. అలా వారి వద్ద ఉన్న రాసలీలల వీడియోలకు ఏకంగా రూ.30 కోట్ల ధర నిర్ణయించారు. చివరకు ప్లాన్ తిరగబడటంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు కామ కిలేడీలు రాజకీయ నేతలపై వలపు వల విసిరారు. రాజకీయ నాయకులను ముగ్గులోకి దింపారు. వారి వద్దకు అమ్మాయిలను పంపారు. అమ్మాయిలతో సన్నిహితంగా ఉన్న రాజకీయ నాయకులను వీడియోలు తీశారు. వీటిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేశారు. 
 
రాసలీలల వీడియోలను అమ్మకానికి పెట్టారు. తమకు రూ.30 కోట్లు ఇస్తే వాటిని ఇచ్చేస్తామని రాజకీయ పార్టీలు, నాయకులకు ఆఫర్‌ ఇచ్చారు. దశలవారీగా చర్చలు జరిగాయి. తనకు కొన్ని వీడియోలు కావాలని ఓ రాజకీయ నాయకుడు ముందుకొచ్చాడు. అందుకు రూ.6 కోట్లు ఇస్తానని ఆఫర్‌ ఇచ్చాడు. కానీ, విడివిడిగా ఇచ్చేది లేదని, మొత్తం అన్ని వీడియోలూ తీసుకోవాలని, రూ.30 కోట్లకు తక్కువైతే కుదరదని ససేమిరా అన్నారు. 
 
మొత్తం కలిపి ఎవరూ తీసుకోకపోవడంతో, చివరికి, రాజకీయ నాయకులకు విడివిడిగా వాటిని అమ్మేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పార్టీల్లోని కిలేడీల సంబంధాలపై ప్రభావం చూపిందని, దాంతో, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా వీలైనంత దండుకోవడానికి ప్రయత్నించారని, ఈ క్రమంలోనే కిలేడీలు పట్టుబడ్డారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో ఐదుగురు కిలేడీలను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయగా, వారంతా ప్రస్తుతం జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. 
 
పైగా, ఈ కేసులో బడా రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు ఉన్నట్టు తేలింది. దీంతో కేసును నీరుగార్చేందుకు కుట్రలు జరుగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఆ రాష్ట్ర సీఎం కమల్‌నాథ్ వర్గంలోకి కీలక నేత ఒకరు ఈ కేసును నీరుగార్చేందుకు తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు వినికిడి. పైగా, ఈ కేసులో విచారణ జరిపితే తేనెటీగల తుట్టెను కదిపినట్టేనని సీఎం కమల్‌నాథ్‌కు ఆయన సలహాదారులు సూచించడంతో సీఎంఓ కూడా మిన్నకుండిపోయినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments