దావోస్ వేదికపై అరుదైన కలయిక - సెటైర్లు వేస్తున్న నెటిజన్లు

Webdunia
మంగళవారం, 24 మే 2022 (10:01 IST)
దావోస్ వేదికగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు కలుసుకున్నారు. ఈ అరుదైన కలయికకు సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, నెటిజన్లు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కేటీఆర్, జగన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, దావోస్ వేదికగా కలుసుకున్న ఈ ఇద్దరు నేతలు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఈ సందర్భంగా "ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డితో గొప్ప సమావేశం జరిగింది" అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే, వీరిద్దరు ఏయే అంశాలపై చర్చించారన్న విషయం మాత్రం గోప్యంగా ఉంచారు.
 
ఇదిలావుంటే, దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక మండలి సదస్సులో పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం జగన్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి.
 
అదేవిధంగా మంత్రి కేటీఆర్‌ కూడా తెలంగాణ పెట్టుబడుల ఆహ్వాన విషయంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు లూలు గ్రూపు అధిపతి యూసుఫ్‌ అలీ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments