Webdunia - Bharat's app for daily news and videos

Install App

దావోస్ వేదికపై అరుదైన కలయిక - సెటైర్లు వేస్తున్న నెటిజన్లు

Webdunia
మంగళవారం, 24 మే 2022 (10:01 IST)
దావోస్ వేదికగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు కలుసుకున్నారు. ఈ అరుదైన కలయికకు సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, నెటిజన్లు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కేటీఆర్, జగన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, దావోస్ వేదికగా కలుసుకున్న ఈ ఇద్దరు నేతలు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఈ సందర్భంగా "ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డితో గొప్ప సమావేశం జరిగింది" అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే, వీరిద్దరు ఏయే అంశాలపై చర్చించారన్న విషయం మాత్రం గోప్యంగా ఉంచారు.
 
ఇదిలావుంటే, దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక మండలి సదస్సులో పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం జగన్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి.
 
అదేవిధంగా మంత్రి కేటీఆర్‌ కూడా తెలంగాణ పెట్టుబడుల ఆహ్వాన విషయంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు లూలు గ్రూపు అధిపతి యూసుఫ్‌ అలీ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments