Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో కలకలం : తొలి కరోనా స్ట్రైన్ తొలి పాజిటివ్ కేసు నమోదు!!

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (14:17 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో కలకలం రేగింది. తొలి కరోనా స్ట్రైన్ కేసు నమోదైంది. బ్రిటన్ నుంచి చెన్నైకు వచ్చిన వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆ వ్యక్తిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, బ్రిటన్ నుంచి వచ్చిన మరికొంతమందిని ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. 
 
నిజానికి ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ హడలిపోతున్నారు. ముఖ్యంగా, అగ్రరాజ్యాలకు చెందిన ప్రజలు సైతం వణికిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. పైగా, ఇది శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో బ్రిటన్ అంటేనే ఇతర దేశాల ప్రజలు హడలిపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో బ్రిటన్ నుంచి ఢిల్లీ వచ్చిన సదరు వ్యక్తి అక్కడి నుంచి చెన్నై చేరుకున్నాడు. కరోనా సోకినట్టు తేలడంతో అతడిని క్వారంటైన్‌లో ఉంచారు. బ్రిటన్‌లో రూపాంతరం చెందిన కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ వ్యక్తి నుంచి నమూనాలు సేకరించి పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. ఆ వ్యక్తికి సోకింది కరోనా కొత్త రకం వైరస్సా? కాదా? అనేది పరీక్షల అనంతరం వెల్లడి కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments