Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్ధవ్‌ ఠాక్రేకు గవర్నర్ ఆహ్వానం : వారంలో బలం నిరూపించుకోవాలి...

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (14:01 IST)
శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నుంచి ఆహ్వానం అందింది. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ కోరారు. అలాగే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారం రోజుల్లో అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకోవాలని కోరారు. ఈ మేరకు ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ నుంచి ఓ లేఖ వచ్చింది. 
 
దీంతో గవర్నర్ కోరిక మేరకు ఉద్ధవ్ ఠాక్రే గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై, దాదర్‌లోని శివాజీ పార్కులో ఈ ప్రమాణ స్వీకార వేడుకలు జరుగనున్నాయి. అయితే, ఉద్ధవ్ ఇపుడు ఏ సభలోనూ సభ్యుడు కాదు. అందువల్ల ఆయన ఆరు నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సివుంటుంది. 
 
మరోవైపు, తన భార్య రష్మీతో కలిసి బుధవారం ఉద్ధవ్ ఠాక్రే... మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో సమావేశమైన విషయం తెలిసిందే. గవర్నర్‌తో ఉద్ధవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారని శివసేన నేతలు అంటున్నారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో రేపు సాయంత్రం 6.40 గంటలకు దాదర్‌లోని శివాజీపార్క్‌లో ఉద్ధవ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments