Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటర్లు సమ్మర్ హాలిడేస్‌కు వెళ్లడం వల్లే ఓడిపోయాం : లక్ష్మీనారాయణ

ఇటీవల దేశంలో వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి కారణాలను ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రి ఒకరు వివరించారు. వేసవి సెలవుల కోసం ఓటర్లంతా తమతమ పిల్లలతో సొంతూర్లకు వెళ్లడం వల్లే ఓడిపోయి

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (09:16 IST)
ఇటీవల దేశంలో వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి కారణాలను ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రి ఒకరు వివరించారు. వేసవి సెలవుల కోసం ఓటర్లంతా తమతమ పిల్లలతో సొంతూర్లకు వెళ్లడం వల్లే ఓడిపోయినట్టు లక్ష్మీనారాయణ చౌదరి అనే మంత్రివర్యులు సెలవిచ్చారు.
 
ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కైరానా లోక్‌సభ, నుపూర్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. బీజేపీ సర్కారుపై వ్యతిరేకతే ఈ ఓటమికి కారణమని విశ్లేషకులు చెబుతుండగా, అబ్బే అలాంటిదేమీ లేదని యోగి కేబినెట్‌లోని ఓ అమాత్యుడు సెలవిచ్చారు. 
 
ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమిపై మంత్రి లక్ష్మీనారాయణ చౌదరి మాట్లాడుతూ నిజానికీ ఎన్నికలను సాధారణ ఎన్నికలతో పోల్చకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరుకు ఈ ఫలితాలు ఎంతమాత్రమూ గీటురాయి కావన్నారు. 
 
పిల్లాపాపలతో కలిసి తమ ఓటర్లు వేసవి సెలవులకు వెళ్లడంతోనే తాము ఓడిపోయామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఇలా జరగదని, ఓటర్లంతా కమలం గుర్తుకే ఓటు వేస్తారంటూ ఆయన సెలవిచ్చారు. మంత్రి వ్యాఖ్యలతో ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా అవాక్కయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

Dhanush: ఆయన వల్లే డంప్‌యార్డ్‌లో ఏడు గంటలపాటు నేను, రష్మిక వున్నాం: ధనుష్

Srileela: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాయిక శ్రీలీల

నాకు పొగరు నిజమే.. దానికి కారణం కూడా నేనే : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments