Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 యేళ్ళ తర్వాత అవిశ్వాసం.. సంఖ్యాబలం లేదని ఎవరన్నారు?

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం అవిశ్వాసం ఎదుర్కోనుండటం దశాబ్దన్నర కాలం తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. కేంద్రంలో

Webdunia
బుధవారం, 18 జులై 2018 (15:38 IST)
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం అవిశ్వాసం ఎదుర్కోనుండటం దశాబ్దన్నర కాలం తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
 
బుధవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల ప్రారంభం తర్వాత టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మాన నోటీసును ఇచ్చారు. దీన్ని స్వీకర్ సుమిత్రా మహాజన్ స్వీకరించారు. అవిశ్వాసంపై చర్చా, సమయాలను పది రోజుల్లో ఖరారు చేస్తానని తెలిపారు. 
 
కాగా, సుమారు 15 యేళ్ళ తర్వాత లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం రానుంది. చివరిసారిగా 2003లో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అది 314-189 ఓట్ల తేడాతో వీగిపోయింది. 
 
మళ్లీ 15 ఏళ్ల తర్వాత మరోసారి నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ భుత్వంపైనే ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రానుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హామీలు అమలు చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. శుక్రవారం ఈ అవిశ్వాసంపై చర్చ చేపట్టనున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన తెలిపారు. 
 
ఇకపోతే, విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ ఆమోదించడంపై కాంగ్రెస్‌ హర్షం వ్యక్తం చేసింది. బుధవారం టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. మా వద్ద తగిన సంఖ్యాబలం లేదని ఎవరన్నారని ప్రశ్నించినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వం జవాబుదారీగా ఉండేలా చేయడానికి ఉపయోగపడుతుందని కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్‌ చేసింది. కీలక అంశాలపై ప్రభుత్వం మౌనం వీడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments