చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే ఇకపై ఉరితో మరణశాసనం

బాలికపై లైంగిక దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులోభాంగా, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే ఉరితో మరణశాసనం లిఖించనున్నారు. ఈ మేరకు లోక్‌సభలో ఓ బిల్లును ప్రవేశప

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (12:37 IST)
బాలికపై లైంగిక దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులోభాంగా, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే ఉరితో మరణశాసనం లిఖించనున్నారు. ఈ మేరకు లోక్‌సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టి దానికి ఆమోదముద్ర వేశారు.


బాలికలపై లైంగిక దాడులకు పాల్పడే కీచకులకు మరణశిక్షను విధించే ప్రతిపాదిత క్రిమినల్ లా (అమెండ్‌మెంట్) బిల్లు-2018కు పార్టీలకు అతీతంగా సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. 
 
అంతకుముందు ఈ బిల్లుపై సభలో ఏకంగా రెండు గంటల పాటు చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం సభ మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపింది.

జమ్మూకాశ్మీర్‌లోని కతువా, యూపీలోని ఉన్నావ్‌లో ఇద్దరు చిన్నారులపై జరిగిన అకృత్యాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో 12 ఏండ్లలోపు పసిమొగ్గలపై అకృత్యాలకు పాల్పడితే మరణశిక్ష విధించే ఆర్డినెన్స్‌ను కేంద్రం ఏప్రిల్ 21న తెచ్చింది. అనంతరం తాజా బిల్లుకు రూపకల్పన చేసి ఆమోదముద్ర వేసేలా సత్వర చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం