Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే ఇకపై ఉరితో మరణశాసనం

బాలికపై లైంగిక దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులోభాంగా, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే ఉరితో మరణశాసనం లిఖించనున్నారు. ఈ మేరకు లోక్‌సభలో ఓ బిల్లును ప్రవేశప

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (12:37 IST)
బాలికపై లైంగిక దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులోభాంగా, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే ఉరితో మరణశాసనం లిఖించనున్నారు. ఈ మేరకు లోక్‌సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టి దానికి ఆమోదముద్ర వేశారు.


బాలికలపై లైంగిక దాడులకు పాల్పడే కీచకులకు మరణశిక్షను విధించే ప్రతిపాదిత క్రిమినల్ లా (అమెండ్‌మెంట్) బిల్లు-2018కు పార్టీలకు అతీతంగా సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. 
 
అంతకుముందు ఈ బిల్లుపై సభలో ఏకంగా రెండు గంటల పాటు చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం సభ మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపింది.

జమ్మూకాశ్మీర్‌లోని కతువా, యూపీలోని ఉన్నావ్‌లో ఇద్దరు చిన్నారులపై జరిగిన అకృత్యాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో 12 ఏండ్లలోపు పసిమొగ్గలపై అకృత్యాలకు పాల్పడితే మరణశిక్ష విధించే ఆర్డినెన్స్‌ను కేంద్రం ఏప్రిల్ 21న తెచ్చింది. అనంతరం తాజా బిల్లుకు రూపకల్పన చేసి ఆమోదముద్ర వేసేలా సత్వర చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం