Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కపిలేశ్వర ఆలయంలో ఆడుకుంటున్న చిరుతపులులు (video)

Webdunia
బుధవారం, 19 మే 2021 (11:57 IST)
తిరుపతిలోని కపిలేశ్వర ఆలయంలో చిరుతపులుల సంచారం కలకలరేపుతోంది. రెండు చిరుత పులులు ఆలయంలో తిరుగుతూ కనిపించాయి. ఈ దృశ్యాలన్నీ మొత్తం సి.సి.టీవీలో రికార్డయ్యాయి. అయితే కరోనా కారణంగా ఆలయాన్ని మూసివేయడంతో నిర్మానుషంగా ఉన్న కారణంగా చిరుతలు వచ్చినట్లు టిటిడి సెక్యూరిటీ సిబ్బంది భావిస్తున్నారు.
 
కరోనా కారణంగా తిరుమలలో క్రమేపీ భక్తుల సంఖ్య తగ్గుతుంటే స్థానిక ఆలయాల్లో అయితే భక్తులే కనిపించడం లేదు. అందులోను స్థానిక ఆలయాలను ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచి ఉండడంతో భక్తులు తక్కువ సంఖ్యలో దర్సనం చేసుకుంటున్నారు. 
 
ఆ తర్వాత భక్తులు లేకపోవడంతో ఆలయాలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. అందులోను టిటిడి ఆధ్వర్యంలో నడుపబడే తిరుపతిలోని కపిలేశ్వర ఆలయం సరిగ్గా శేషాచలం అడవులకు సమీపంలో ఉంది. శేషాచలం అడవుల్లో చిరుత పులల సంచారం ఎప్పటి నుంచో ఉంది. నిర్మానుషంగా ఉండటంతో చిరుత పులులు ఇష్టానుసారం జనం తిరిగే ప్రాంతంలోకే వచ్చేస్తున్నాయి.
 
కపిలేశ్వర ఆలయంలో కూడా రాత్రి 7 గంటల సమయంలో రెండు చిరుతపులులు వచ్చినట్లు టిటిడి సెక్యూరిటీ సిబ్బంది సిసి కెమెరాల ద్వారా గుర్తించారు. అక్కడున్న టిటిడి సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేశారు. అయితే అప్పటికే చిరుతలు దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. కానీ మొట్టమొదటి సారి ఆలయంలోకి చిరుతలు రావడం ఇదే ప్రధమమంటున్నారు టిటిడి అధికారులు. 

 

సంబంధిత వార్తలు

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments