Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏక కణ జీవి అమీబా సోకి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ : యువకుడి మృతి

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (18:32 IST)
కేరళ రాష్ట్రంలో ఒక విషాదకర ఘటన జరిగింది. స్వేచ్ఛగా జీవించే ఏక కణజీవి అమీబా కారణంగా కేరళ రాష్ట్రంలోని అళపుళాలో ఓ యుకుడికి బ్రెయిన్ ఫీవర్ సోకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అళపుళాలోని పానవల్లి తీర ప్రాంతానికి చెందిన 15 యేళ్ళ బాలుడు  ప్రైమరీ అమీబిక్ మెనింగ్ ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి బారినపడినట్టు చెప్పారు. బాలుడి మరణాన్ని ఆరోగ్య మంత్రి ధృవీకరించారు.
 
అదేవిధంగా గతంలో ఐదు అరుదైన ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్టు తెలిపారు. తొలిసారిగా 2016లో అళపుళాలోని తిరుమల వార్డులో ఈ కేసులు నమోదైనట్టు తెలిపారు. మలప్పురంలోని 2019, 2020 సంవత్సరాల్లో రెండు కేసులు నమోదయ్యాయని, 2020లో కోళికోడ్, 2022లో త్రిసూర్‌లో ఒక కేసు నమోదైనట్టు ఆమె త్రిశూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 
 
ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు జ్వరం, తలనొప్పి, వాంతులు. కాగా, ఈ వ్యాధి సోకిన వారంతా మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రి చెప్పారు. తద్వారా ఈ అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ మరణాల రేటు 100 శాతంగా ఉంది. ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే అమీబా ఏక కణ జీవులు నిశ్చల నీటిలో కనిపిస్తాయని మంత్రి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

Tuk Tuk: సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ సినిమా టుక్‌ టుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments