Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ పోలీసులు సూపర్.. అయ్యప్పనమ్ కోషియం పాటకు స్టెప్పులు.. వీడియో వైరల్

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (20:59 IST)
కరోనావైరస్ మహమ్మారి సమయంలో చేతులు శుభ్రపరుచుకోవడం ఎలా అనేందుకు సరైన మార్గాన్ని కేరళ పోలీసులు బోధిస్తున్నారు. కేరళ పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా వీరు విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పోలీసులు కోవిడ్ -19 నుండి తమను తాము రక్షించుకోవడానికి సబ్బుతో చేతులు కడుక్కోవడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. 
 
94 సెకన్ల వీడియోలో, ఆరుగురు పోలీసులు ముసుగులు ధరించి, పృథ్వీరాజ్ మరియు బిజు మీనన్ నటించిన ఇటీవలి బాక్సాఫీస్ హిట్ అయ్యప్పనమ్ కోషియం నుండి ఒక పాటకు నృత్యం చేశారు.
 
దీనిని రాష్ట్ర పోలీసు మీడియా సెంటర్ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. కేవలం 20 గంటల్లో, ఇది 38,000 వీక్షణలు మరియు 33,000 షేర్లను సంపాదించింది. కాగా కేరళలో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.  రోజువారీ కేసులు 30 వేలకు పైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.  
 
మొదటి వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న కేరళ, సెకండ్ వేవ్ ధాటికి విలవిలలాడిపోతుంది.  కరోనా నుంచి బయటపడేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం పోలీసులు సిద్ధమయ్యారు. 
 
ఇటీవలే బాగా పాపులర్ అయిన ఎంజాయి ఎంజామి అనే సాంగ్ ను కరోనా మహమ్మారికి తగిన విధంగా రీమిక్స్ చేసి దానికి తగిన విధంగా పోలీసులు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు.  
 
పోలీసులకు, సమాజానికి భయపడి మాత్రమే మాస్కులు పెట్టుకోవడం కాదని, దానిని ఒక అలవాటుగా మార్చుకుంటే తప్పకుండా కరోనాపై విజయం సాధించవచ్చని పోలీసులు చెప్తున్నారు. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అయ్యింది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag: నాగార్జున 100వ చిత్రం, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాగ చైతన్య టీమ్

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మైథలాజికల్ థ్రిల్లర్ మయూఖం

గ్రాండ్ పేరెంట్స్‌‌కి ఉచితంగా ప్రదర్శించనున్న త్రిబాణధారి బార్బరిక్ టీం

రోషన్ కనకాల.. మోగ్లీ గ్లింప్స్ లాంచ్ చేసిన రామ్ చరణ్.. నాని వాయిస్ ఓవర్

బాహుబలి తర్వాత కుటుంబంతో చూసేలా లిటిల్ హార్ట్స్ - ఆదిత్య హాసన్, సాయి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments