#KarnatakaElections2018 : మోగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా...

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 224 స్థానాలు కలిగిన ఈ రాష్ట్ర శాసనసభకు మే 12వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ పోలింగ్ ఒకే దశలో నిర్వహించనున్నారు. ఆ తర్వాత మే 15వ తేదీన కౌంటింగ్ చేపడుతామని కే

Webdunia
మంగళవారం, 27 మార్చి 2018 (11:39 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 224 స్థానాలు కలిగిన ఈ రాష్ట్ర శాసనసభకు మే 12వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ పోలింగ్ ఒకే దశలో నిర్వహించనున్నారు. ఆ తర్వాత మే 15వ తేదీన కౌంటింగ్ చేపడుతామని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాష్ రావత్ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 
 
మే 12న పోలింగ్, మే 15న కౌంటింగ్ జరుతుందని ఆయన తెలిపారు. కర్ణాటకలో మొత్తం ఓటర్లు 4.96 కోట్ల మంది ఉండగా అందులో పురుషుల ఓటర్లు 2.51 కోట్లు కాగా మహిళా ఓటర్లు 2.45 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. ఎన్నికల సందర్భంగా గట్టి బందోవస్తు ఏర్పాటు చేస్తామని, సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత బందోబస్తును పెంచడం జరుగుతుందన్నారు. 
 
మరోవైపు, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ముందస్తు సర్వేలు చెపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడమేకాకుండా క్రితంసారి కన్నా సీట్ల సంఖ్యను కూడా పెంచుకుంటుందని సీ-ఫోర్ సర్వే అంచనా వేసింది. రాష్ట్రంలోని 154 నియోజకవర్గాల పరిధిలో ఈ నెల ఒకటో తేదీ నుంచి 25 మధ్య 22,357 మంది ఓటర్లను కలుసుకొని ఈ సర్వే నిర్వహించినట్టు ఆ సంస్థ సోమవారం వెల్లడించింది. 
 
రాష్ట్రవ్యాప్తంగా 2,368 పోలింగ్ బూత్‌ల పరిధిలో సర్వే చేశామని, తమ అంచనా తప్పు కావడానికి కేవలం ఒక్క శాతం మాత్రమే అవకాశం ఉందని ఆ సంస్థ పేర్కొంది. 2013లో సీ-ఫోర్ సంస్థ కాంగ్రెస్‌కు 119-120 సీట్లు వస్తాయని అంచనా వేయగా, ఆ పార్టీ 122 సీట్లను గెలుచుకుంది. అయితే ఈసారి కాంగ్రెస్‌కు తొమ్మిది శాతం ఓట్లు పెరిగి మొత్తం 46శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. బీజేపీకి 31 శాతం, జనతాదళ్ (సెక్యూలర్)కు 16శాతం ఓట్లు లభిస్తాయని పేర్కొంది. 
 
224 మంది ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 126 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. బీజేపీకి కూడా సీట్లు పెరుగుతాయని, జేడీ(ఎస్) నష్టపోతుందని అంచనా వేసింది. బీజేపీ తన సీట్ల సంఖ్యను 40 నుంచి 70కి పెంచుకుంటుందని, జేడీ(ఎస్) స్కోరు మాత్రం 40 నుంచి 27కు తగ్గిపోతుందని తెలిపింది. ఇతరులకు ఏడు శాతం ఓట్లు లభిస్తాయని దీంతో వారికి కూడా ఒక సీటు లభిస్తుందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓటీటీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్‌ రికార్డ్ క్రియేట్ చేసిన మన శంకరవర ప్రసాద్ గారు

Srivishnu: విష్ణు విన్యాసం లో శ్రీ విష్ణు, నయన సారిక ల లవ్లీ కెమిస్ట్రీ

Jagapathi Babu: డబ్బంటే పిచ్చి వుంటే అది జబ్బు : జగపతిబాబు

డిస్ట్రిబ్యూటర్లతోపాటు ప్రేక్షకుడూ హ్యాపీ అయ్యేలా ఫంకీ వుంది : సూర్యదేవర నాగవంశీ

వారణాసి సైన్స్ ఫిక్షన్ ఫీల్ కనిపిస్తున్నా... ఎస్.ఎస్.రాజమౌళి క్లారిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Valentines Day: వాలెంటైన్స్ డే.. ఎర్ర గులాబీల ఔచిత్యం.. సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం..

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

వేసవిలో చల్లచల్లగా కర్బూజ రసం తాగితే ఇవే ప్రయోజనాలు

మేడ్ ఇన్ ఇండియా, దేశ్ బంధు గుప్తా, లూపిన్ అండ్ ఇండియన్ ఫార్మా పుస్తకం ఆవిష్కరణ

ఓట్స్ తింటే 6 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments