Webdunia - Bharat's app for daily news and videos

Install App

రమ్య ఎటెళ్లిపోయింది.. వరదలు ముంచేస్తుంటే జర్మనీలో ఈ ఫోటో ఏంటి?

కాంగ్రెస్ నేత, సినీ నటి రమ్య ప్రజల సమస్యలపై స్పందించేందుకు ముందుంటారు. కాంగ్రెస్ నేతగా పార్టీకి సంబంధించిన అన్నీ విషయాల్లో చురుకుగా వ్యవహరిస్తుంటారు. గత కొంతకాలంగా ఆమె పార్టీకి, సోషల్ మీడియాకు దూరంగా

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (14:38 IST)
కాంగ్రెస్ నేత, సినీ నటి రమ్య ప్రజల సమస్యలపై స్పందించేందుకు ముందుంటారు. కాంగ్రెస్ నేతగా పార్టీకి సంబంధించిన అన్నీ విషయాల్లో చురుకుగా వ్యవహరిస్తుంటారు. గత కొంతకాలంగా ఆమె పార్టీకి, సోషల్ మీడియాకు దూరంగా వుంటున్నారు. కేరళ, కర్ణాటకల్లో వర్షాలు, వరదలు ముంచెత్తినా రమ్య స్పందించలేదు. దీనిపై నటి రమ్యపై నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
అయితే ఉన్నట్టుండి నటి రమ్యకు సంబంధించిన ఒక ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కొద్ది కాలంగా కనిపించని రమ్య ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు జర్మనీ పర్యటనలో రమ్య వున్నారు. రమ్యతో పాటు కాంగ్రెస్‌ నేత మిలింద్‌ దియోరా కలిసి తీయించుకున్న ఫొటోతో పాటు కర్ణాటక ఇన్‌చార్జిలలో ఒకటైన మధుయాష్కి గౌడతో కూడా రమ్య దిగిన ఫొటో వైరల్‌ అవుతోంది.
 
రాష్ట్రంలోని కొడగు జిల్లా భారీ వర్షాలు, వరదలతో అట్టుడికిపోయి ప్రజలు హాహాకారాలు చేస్తుంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిన రమ్యకు విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఎలా వచ్చిందని నెటిజన్లు మండిపడుతున్నారు. మరి ఈ వార్తలపై రమ్య ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments