'మేడ్ ఇన్ ఇండియా - మేడ్ ఫర్ ఇండియా'... జియో వీడియో కాలింగ్ యాప్ (video)

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (08:58 IST)
దేశంలో చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. దీంతో వీడియో కాలింగ్‌ చేసుకునే వారికి సమస్య తప్పదని భావిస్తూ వచ్చారు. అయితే, రిలయన్స్ జియో మరో అడుగు ముందుకేసింది. 
 
జూమ్ తదితర వీడియో కాలింగ్ యాప్‌లపై విముఖత పెరుగుతున్న వేళ, 'జియో మీట్' పేరిట హై డెఫినిషన్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ను విడుదల చేసింది. ఇందులో ఇన్వైట్ కోడ్స్ అవసరం లేదని, ఇదే దీని ప్రత్యేకతని జియో ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
100 మంది వరకూ ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చని, తమతమ స్క్రీన్స్ షేర్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. ఈ యాప్ పూర్తిగా ఉచితమని వెల్లడించింది. 
 
లాక్డౌన్ సమయంలో ఇంట్లో నుంచే పని చేసుకోవడానికి, అధికారులు, సిబ్బందితో కలిసుండటానికి, పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులు చెప్పుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. ఈ యాప్‌ను https://jiomeetpro.jio.com నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments