Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొక్కలున్న మీకు భయం.. నాకు కాదు.. తమాషాలేస్తే...: పవన్ వార్నింగ్

గుంటూరులో జరిగిన పార్టీ అవిర్భావ సభలో తాను చేసిన విమర్శల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తనపై మాటల దాడి చేయడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన శుక్రవారం గుంటూరు జిల్

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (12:10 IST)
గుంటూరులో జరిగిన పార్టీ అవిర్భావ సభలో తాను చేసిన విమర్శల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తనపై మాటల దాడి చేయడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన శుక్రవారం గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డయేరియాతో బాధపడుతున్న రోగులను పరామర్శించారు. 
 
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, టీడీపీతో ఉన్నంత కాలం తనను టీడీపీ మనిషి అన్నారు. టీడీపీపై విమర్శలు గుప్పించగానే బీజేపీ మనిషినంటున్నారు. తన వెనుక బీజేపీ ఉందని, ఆ పార్టీ నేతల ప్రమేయంతోనే తాను టీడీపీని విమర్శించానని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బొక్కలు (లూప్ హోల్స్), లొసుగులు ఉన్న టీడీపీ వారు కేంద్రానికి భయపడతారేమో తప్ప, తాను ఎవరికీ భయపడబోనని, తలొగ్గనని స్పష్టంచేశారు. పైగా, తనతో తమాషాలేయొద్దనీ, మీరు తనను విమర్శిస్తే, మీకంటే పది రెట్లు బలంగా మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. 
 
అలాగే, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే విషయంలో ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రత్యేక హోదా అంశంపై తెదేపా, వైకాపా నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. అవిశ్వాసం పెట్టే అంశంలో రెండు పార్టీలు తేదీలను ముందుకు, వెనక్కి జరుపుతున్నాయన్నారు. అవిశ్వాస తీర్మానంపై తెదేపా, వైకాపా ఒక్కటయ్యాయని అంటున్నారని.. అక్కడే వారి కుమ్మక్కు అర్థమవుతోందని పవన్‌ వ్యాఖ్యానించారు.
 
అంతేకాకుండా, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే గుంటూరులో అతిసారానికి 14 మంది చనిపోయారన్నారు. ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు పట్టించుకోవడం దారుణమన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లలో ఎవరైనా చనిపోతే ఇలాగే ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించారు. 48 గంటల్లోగా ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోతే గుంటూరులో బంద్‌‌కు పిలుపునిస్తానని, తానే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ నటుడు షిహాన్ హుస్సేని మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments