Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి చెక్.. కరీనాను రంగంలోకి దించనున్న హస్తం పార్టీ

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (10:26 IST)
బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ నేతల ప్లాన్ చేస్తున్నారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్‌లో బీజేపీని మట్టికరిపించిన కాంగ్రెస్ పార్టీ.. అదే జోరును లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని కోరుకుంటోంది. 
 
బీజేపీకి కంచుకోటగా వున్న భోపాల్‌ను దక్కించుకోవాలంటే కరీనా లాంటి సెలబ్రిటీకి పోటీకి దించకతప్పదని కాంగ్రెస్ నాయకులు గుడ్డు చౌహాన్, అనీస్ ఖాన్ పార్టీ హైకమాండ్‌కు వివరించినట్లు సమాచారం. అభిమానగణంతో పాటు భర్త సైఫ్ అలీఖాన్ తాత ఒకప్పుడు భోపాల్ నవాబ్‌గా పనిచేశారు. నవాబ్ కాలం నుంచి ఆయనకు మంచి పేరుండటంతో.. సైఫ్ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్‌కు మంచి పేరు లభిస్తుందని టాక్. 
 
ఇంకా అందరూ కలిసి పనిచేస్తే కాంగ్రెస్‌కు విజయం తథ్యమని నేతలు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీని ఎదుర్కొనే గట్టి నేతలు ఎవ్వరూ లేకపోవడంతోనే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కరీనాను పోటీకి దించాలని చూస్తున్నారని కమలనాథులు విమర్శించారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments