Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రయాన్‌కు చిక్కిన జాబిలి... ఫోటోను విడుదల చేసిన ఇస్రో

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (11:30 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇటీవల నింగిలోకి పంపిన చంద్రయాన్ పనితీరు భేషుగ్గా ఉంది. ప్రస్తుతం ఇది చంద్రుడు కక్ష్యలో 2,650 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. పైగా, అంత ఎత్తులో నుంచి చంద్రుడుని ఓ ఫోటో తీసి భూమికి చేరవేసింది. ఈ ఫోటోను ఇస్రో తాజాగా విడుదల చేసింది. 
 
ఇంద్రయాన్ 2 ప్రాజెక్టును భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెల్సిందే. చంద్రయాన్ 2 మిషన్‌లోని ల్యాండర్, రోవర్ సెప్టెంబర్ 7న తెల్లవారు జామున 1.40 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండ్ కానున్నాయి. ఈ మొత్తం ప్రక్రియ 15 నిమిషాల్లో పూర్తి కానుందని అధికారులు వెల్లడించారు. 
 
అయితే, చంద్రయాన్ చంద్రుడు కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత తొలి అద్భుతాన్ని ఆవిష్కరించింది. చంద్రుడిని తన కెమెరాలో బంధించిన చిత్రాన్ని భూమిపైకి పంపింది. ఎల్-14 కెమెరాతో రాత్రి సమయంలో చంద్రయాన్-2 ల్యాండర్ చిత్రీకరించిన ఫోటోను ఇస్రో విడుదల చేసింది. 
 
ఇక ఈ ఫోటోను ట్వీట్ చేసిన ఇస్రో, చంద్రుడి దక్షిణార్ధగోళంలో ఉన్న అపోలో క్రేటర్స్‌ బిలం, పశ్చిమ అంచులో ఉన్న మేర్‌ ఓరియంటేల్‌ అనే మరొక పెద్ద బిలాన్ని చిత్రంలో చూడవచ్చని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments