Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రయాన్‌కు చిక్కిన జాబిలి... ఫోటోను విడుదల చేసిన ఇస్రో

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (11:30 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇటీవల నింగిలోకి పంపిన చంద్రయాన్ పనితీరు భేషుగ్గా ఉంది. ప్రస్తుతం ఇది చంద్రుడు కక్ష్యలో 2,650 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. పైగా, అంత ఎత్తులో నుంచి చంద్రుడుని ఓ ఫోటో తీసి భూమికి చేరవేసింది. ఈ ఫోటోను ఇస్రో తాజాగా విడుదల చేసింది. 
 
ఇంద్రయాన్ 2 ప్రాజెక్టును భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెల్సిందే. చంద్రయాన్ 2 మిషన్‌లోని ల్యాండర్, రోవర్ సెప్టెంబర్ 7న తెల్లవారు జామున 1.40 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండ్ కానున్నాయి. ఈ మొత్తం ప్రక్రియ 15 నిమిషాల్లో పూర్తి కానుందని అధికారులు వెల్లడించారు. 
 
అయితే, చంద్రయాన్ చంద్రుడు కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత తొలి అద్భుతాన్ని ఆవిష్కరించింది. చంద్రుడిని తన కెమెరాలో బంధించిన చిత్రాన్ని భూమిపైకి పంపింది. ఎల్-14 కెమెరాతో రాత్రి సమయంలో చంద్రయాన్-2 ల్యాండర్ చిత్రీకరించిన ఫోటోను ఇస్రో విడుదల చేసింది. 
 
ఇక ఈ ఫోటోను ట్వీట్ చేసిన ఇస్రో, చంద్రుడి దక్షిణార్ధగోళంలో ఉన్న అపోలో క్రేటర్స్‌ బిలం, పశ్చిమ అంచులో ఉన్న మేర్‌ ఓరియంటేల్‌ అనే మరొక పెద్ద బిలాన్ని చిత్రంలో చూడవచ్చని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments