ఇస్రోకు - జీశాట్ 6ఏకు సంబంధాలు తెగిపోయాయి...

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తాజాగా ప్రయోగించిన జీశాట్-6ఏతో సంబంధాలు కోల్పోయినట్టు ఆ సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ శాటిలైట్ నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని జీశాట్‌-6ఏను ప్రయోగించిన 48 గంటల

Webdunia
ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (13:49 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తాజాగా ప్రయోగించిన జీశాట్-6ఏతో సంబంధాలు కోల్పోయినట్టు ఆ సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ శాటిలైట్ నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని జీశాట్‌-6ఏను ప్రయోగించిన 48 గంటల తర్వాత ఇస్రో తెలిపింది. ఈ ఉపగ్రహానికి సంబంధించి చివరిదైన మూడో లామ్‌ ఇంజిన్‌ను మండించిన సమయం నుంచి దానితో అనుసంధానం కోల్పోయామని ఇస్రో తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.
 
కాగా, భారత్‌ అభివృద్ధి చేసిన రాకెట్లలో రెండో అతిపెద్దదిగా పేరు గాంచిన జీశాట్‌-6ఏ ఉపగ్రహాన్ని గురువారం విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. ప్రయోగం జరిగిన తర్వాత రాకెట్‌ నిర్ణీత కక్ష్యలో జీశాట్‌-6ఏ ఉపగ్రహాన్ని చేర్చడానికి 17 నిమిషాల సమయం పట్టింది. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లోనే ఇది 12వది. 
 
అయితే, ఈ శాటిలైట్ ప్రయోగించిన తర్వాత అంటే మార్చి 30న ఉదయం 9.22 నిమిషాలకు సమాచారం అందింది. మొదటిసారి కక్ష్య పెంపు ప్రక్రియ చేపట్టిన సమయంలో అది సమాచారాన్ని చేరవేసిందని తెలిపింది. ఆ తర్వాత రెండోసారి కక్ష్య పెంపును మార్చి 31న చేపట్టినట్లు తెలిపింది. ఉపగ్రహంతో అనుసంధానం కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇస్రో అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments