Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ పర్యటనలో త్రివర్ణపతాకం చిరిగిపోయింది.. బ్రిటన్ సారీ చెప్పింది...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్‌ పర్యటనలో ఉన్నారు. ఆ సమయంలో భారత జాతీయ పతాకానికి అవమానం జరిగింది. మోడీ పర్యటనకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనల్లో త్రివర్ణపతాకం చిరిగిపోయింది. దీంతో బ్రిటన్ సారీ చెప్పింది

Webdunia
శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (12:28 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్‌ పర్యటనలో ఉన్నారు. ఆ సమయంలో భారత జాతీయ పతాకానికి అవమానం జరిగింది. మోడీ పర్యటనకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనల్లో త్రివర్ణపతాకం చిరిగిపోయింది. దీంతో బ్రిటన్ సారీ చెప్పింది. 
 
ప్రధాని మోడీ పర్యటనను నిరసిస్తూ పార్లమెంట్ స్కేర్‌‌లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పార్లమెంట్ స్కేర్‌‌లో మోడీకి వ్యతిరేకంగా 500 మంది ఆందోళనకారులు నిరసన తెలిపారు. ఇందులో యూకే సిఖ్ ఫెడరేషన్‌‌కు చెందిన ఖలిస్థాన్ మద్దతుదారులు, పాకిస్థాన్ సంతతి వ్యక్తి నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలోని మోడీని వ్యతిరేకించే మైనార్టీలు కూడా వీళ్లలో ఉన్నారు.
 
ఈ ఆందోళనల్లో త్రివర్ణ పతాకం చినిగిపోయింది. దీంతో అక్కడి భారత అధికారులు ఈ ఘటనపై విదేశాంగ కార్యాలయంతో పాటు స్కాట్లాండ్ యార్డ్‌కు ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది. అయితే పార్లమెంట్ స్కేర్‌‌లో జరిగిన ఘటన మమ్మల్ని అసంతృప్తికి గురిచేసింది. దీని గురించి తెలిసిన వెంటనే హై కమిషనర్ యష్‌వర్ధన్ కుమార్ సిన్హాతో మాట్లాడాం. మోడీ టూర్ కారణంగా భారత్‌తో యూకే బంధం మరింత బలోపేతమైంది అని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments