గాడ్సేకు వీరాభిమానిని... గాంధీ వుంటే నేనే చంపేదాన్ని : హిందూ కోర్టు జడ్జి

స్వయం ప్రకటిత, వివాదాస్పద హిందూ కోర్టు జడ్జి, సామాజిక కార్యకర్త పూజ శకున్ పాండే మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మహాత్మా గాంధీని గాడ్సే చంపకపోయి ఉంటే నేను చంపేదాన్ని' అని ఆమె వ్యాఖ్యానించారు. పైగా, గా

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (09:21 IST)
స్వయం ప్రకటిత, వివాదాస్పద హిందూ కోర్టు జడ్జి, సామాజిక కార్యకర్త పూజ శకున్ పాండే మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మహాత్మా గాంధీని గాడ్సే చంపకపోయి ఉంటే నేను చంపేదాన్ని' అని ఆమె వ్యాఖ్యానించారు. పైగా, గాంధీని గాడ్సే చంపలేని స్పష్టంచేశారు.
 
ఇదే అంశంపై ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో... 'నేటికైనా సరే.. దేశాన్ని విభజించాలని భావించే గాంధీ ఒకరుంటే, అడ్డుకునే గాడ్సే ఒకరుంటారు. నాథూరామ్‌ గాడ్సేను నేను ఆరాధిస్తానని చెప్పడానికి గర్విస్తున్నాను. గాంధీని గాడ్సే చంపలేదు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చేలోపే అతడిని శిక్షించారు. అందరూ అసలు చరిత్ర చదవాలి' అంటూ వ్యాఖ్యానించారు. 
 
కాగా, గతంలో సైతం.. ట్రిపుల్‌ తలాక్‌ వల్ల భర్తలకు దూరమైన ముస్లిం మహిళలు హిందూధర్మాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు వివాదాలకు కేంద్రబిందువయ్యాయి. కాగా, హిందూ కోర్టు పేరుతో అఖిల భారత హిందూ సభ (ఎబిహెచ్‌ఎం) కొద్ది రోజుల క్రితం మీరట్‌లో సొంతంగా హిందూ కోర్టును ఏర్పాటు చేసింది. ఈ కోర్టు ఏర్పాటుపై అలహాబాద్ కోర్టులో విచారణ జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments