Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాకింగ్ వెళ్లిన దంపతులను తరుముకున్న గజరాజు.. ఎక్కడ?

సెల్వి
సోమవారం, 24 జూన్ 2024 (17:39 IST)
Wild elephant
కోయంబత్తూరులో అటవీ ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాకింగ్ వెళ్లిన కోవై దంపతులకు గజరాజు చుక్కలు చూపించింది. అడవి నుంచి నేను కూడా వాకింగ్ వచ్చానన్న రీతిలో ఆ దంపతుల వెంటపడింది. అంతే ఆ దంపతులు గజరాజును చూసి భయపడి పరుగులు తీశారు. అయినా ఆ ఏనుగు ఆ దంపతుల ఇంటి వరకు వచ్చింది. గేటు తెరిచి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. 
 
కోవై జిల్లా, మరుదమలై పశ్చిమ శ్రేణి పర్వత ప్రాంతం. ఇక్కడ గత కొన్ని రోజులుగా సుమారు 11 ఏనుగులు నివాస ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. ఈ ఏనుగులు ఆహారం, నీరు కోసం రాత్రి వేళల్లో ప్రజల నివాస ప్రాంతంలోకి వస్తున్నాయి. 
 
ఆ విధంగా వచ్చే ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతంలోకి తిరిగి పంపేందుకు అటవీశాఖా అధికారులు సిద్ధంగా వుంటారు. ఈ నేపథ్యంలో నిన్న శనివారం రాత్రి, మరుదమలై సమీపంలో ఉన్న భారతీయర్ విశ్వవిద్యాలయం సమీపంలోని నివాస ప్రాంతంలో సాయంత్రం వాకింగ్ వెళ్లిన దంపతులు అడవి ఏనుగును చూసి షాకయ్యారు. వెంటనే ఆ దంపతులు ఇంట్లోకి పరుగులు పెట్టారు. ఆపై ఆ ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments