Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాకింగ్ వెళ్లిన దంపతులను తరుముకున్న గజరాజు.. ఎక్కడ?

సెల్వి
సోమవారం, 24 జూన్ 2024 (17:39 IST)
Wild elephant
కోయంబత్తూరులో అటవీ ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాకింగ్ వెళ్లిన కోవై దంపతులకు గజరాజు చుక్కలు చూపించింది. అడవి నుంచి నేను కూడా వాకింగ్ వచ్చానన్న రీతిలో ఆ దంపతుల వెంటపడింది. అంతే ఆ దంపతులు గజరాజును చూసి భయపడి పరుగులు తీశారు. అయినా ఆ ఏనుగు ఆ దంపతుల ఇంటి వరకు వచ్చింది. గేటు తెరిచి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. 
 
కోవై జిల్లా, మరుదమలై పశ్చిమ శ్రేణి పర్వత ప్రాంతం. ఇక్కడ గత కొన్ని రోజులుగా సుమారు 11 ఏనుగులు నివాస ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. ఈ ఏనుగులు ఆహారం, నీరు కోసం రాత్రి వేళల్లో ప్రజల నివాస ప్రాంతంలోకి వస్తున్నాయి. 
 
ఆ విధంగా వచ్చే ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతంలోకి తిరిగి పంపేందుకు అటవీశాఖా అధికారులు సిద్ధంగా వుంటారు. ఈ నేపథ్యంలో నిన్న శనివారం రాత్రి, మరుదమలై సమీపంలో ఉన్న భారతీయర్ విశ్వవిద్యాలయం సమీపంలోని నివాస ప్రాంతంలో సాయంత్రం వాకింగ్ వెళ్లిన దంపతులు అడవి ఏనుగును చూసి షాకయ్యారు. వెంటనే ఆ దంపతులు ఇంట్లోకి పరుగులు పెట్టారు. ఆపై ఆ ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments