Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజాస్వామ్యం ఖూనీ కావడాన్ని చూసి భారతావని మౌనం పాటిస్తోంది : రాహుల్ ట్వీట్

ప్రపంచంలోనే అత్యంత గొప్పదిగా భావించే భారత ప్రజాస్వామ్యం ఖూనీ కావడాన్ని యావత్ భారతావని మౌనం పాటిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

Webdunia
గురువారం, 17 మే 2018 (11:00 IST)
ప్రపంచంలోనే అత్యంత గొప్పదిగా భావించే భారత ప్రజాస్వామ్యం ఖూనీ కావడాన్ని యావత్ భారతావని మౌనం పాటిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
 
గురువారం ఉదయం కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడాన్ని తప్పుబడుతూ తన ట్విట్టర్ ఖాతాలో విమర్శలు గుప్పించారు. మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలం లేనప్పటికీ, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ఇది బీజేపీ అహేతుకమైన పట్టుదలంటూ వ్యాఖ్యానించారు. 
 
నిజానికి గురువారం ఉదయం బీజేపీ విజయోత్సవాలను జరుపుకుంటూ ఉంటే, భారతావని ప్రజాస్వామ్యం ఖూనీ కావడాన్ని చూసి మౌనం పాటిస్తోందని అన్నారు. భారత రాజ్యాంగాన్నీ బీజేపీ అపహాస్యం చేసిందని నిప్పులు చెరిగారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠాన్ని ప్రజలే చెబుతారంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments