Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్లో మాట్లాడుకున్న భారత్-చైనా దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (20:41 IST)
“గాల్వన్” నదీ ప్రాంతంలో చైనా ముందస్తు పథకం ప్రకారం చేసిన చర్యలే, సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలు, ఇతర పరిణామాలన్నింటికీ మూల కారణం అని భారత విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి ఎస్. జయశంకర్ చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యీకి స్పష్టం చేశారు. అయితే భారత్ పైనే చైనా నిందలు మోపి, ఇరు దేశాల మిలటరీ అధికారులు చేసుకున్న ఒప్పందాలను, ఏకాభిప్రాయాలను ఉల్లంఘించి, దాడులకు పాల్పడిన భారత్ సైనికులను శిక్షించాలన్నారు చైనా విదేశీ వ్యవహరాల మంత్రి వాంగ్.
 
“గాల్వన్” లోయలో పరిస్థితి సద్దుమణిగిన తర్వాత, మరోసారి భారత్ సైనికులు “వాస్తవాధీన రేఖ”ను దాటి వచ్చి, కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని చైనా మంత్రి నిందలు మోపారు. అతి ప్రమాదకరమైన ఈ చర్య ద్వారా భారత్ అంతర్జాతీయ సంబంధాలకు చెందిన మౌలిక నియమాలను ధిక్కరణకు పాల్పడిందంటూ చైనా మంత్రి వాంగ్ యూ భారత్ మంత్రికి తెలిపారు.
 
ఇరువైపులా మొత్తంగా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మాట వాస్తవమే కానీ, జూన్ 6వ తేదీన ఇరు దేశాలు వచ్చిన అవగాహన మేరకు పరస్పర దాడులకు పాల్పడకుండా సంయమనం పాటించాల్సిన అవసరాన్ని భారత్ మంత్రి ఎస్. జయశంకర్ చైనా విదేశాంగ మంత్రికి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments