Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్లో మాట్లాడుకున్న భారత్-చైనా దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (20:41 IST)
“గాల్వన్” నదీ ప్రాంతంలో చైనా ముందస్తు పథకం ప్రకారం చేసిన చర్యలే, సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలు, ఇతర పరిణామాలన్నింటికీ మూల కారణం అని భారత విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి ఎస్. జయశంకర్ చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యీకి స్పష్టం చేశారు. అయితే భారత్ పైనే చైనా నిందలు మోపి, ఇరు దేశాల మిలటరీ అధికారులు చేసుకున్న ఒప్పందాలను, ఏకాభిప్రాయాలను ఉల్లంఘించి, దాడులకు పాల్పడిన భారత్ సైనికులను శిక్షించాలన్నారు చైనా విదేశీ వ్యవహరాల మంత్రి వాంగ్.
 
“గాల్వన్” లోయలో పరిస్థితి సద్దుమణిగిన తర్వాత, మరోసారి భారత్ సైనికులు “వాస్తవాధీన రేఖ”ను దాటి వచ్చి, కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని చైనా మంత్రి నిందలు మోపారు. అతి ప్రమాదకరమైన ఈ చర్య ద్వారా భారత్ అంతర్జాతీయ సంబంధాలకు చెందిన మౌలిక నియమాలను ధిక్కరణకు పాల్పడిందంటూ చైనా మంత్రి వాంగ్ యూ భారత్ మంత్రికి తెలిపారు.
 
ఇరువైపులా మొత్తంగా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మాట వాస్తవమే కానీ, జూన్ 6వ తేదీన ఇరు దేశాలు వచ్చిన అవగాహన మేరకు పరస్పర దాడులకు పాల్పడకుండా సంయమనం పాటించాల్సిన అవసరాన్ని భారత్ మంత్రి ఎస్. జయశంకర్ చైనా విదేశాంగ మంత్రికి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments