Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిషాలో విధ్వంసం సృష్టించిన ఫోనీ తుఫాన్(Video)

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (19:41 IST)
బంగాళాఖాతంలో సుదీర్ఘంగా ప్రయాణించిన ఫోనీ తుఫాన్ తొలుత తమిళనాడు తీరాన్ని తాకుతుందనీ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అనుకున్నారు. ఐతే అది ఒడిషా వద్ద తీరాన్ని దాటింది. దీనితో ఇక్కడ ప్రచంఢ గాలులతో బీభత్సం సృష్టించింది ఫోనీ తుఫాన్.

భువనేశ్వర్ లోని ఎయిమ్స్ హాస్టల్ పైకప్పు ఎగిరిపోయింది. అంతేకాదు.. క్లాసు రూముల్లో వున్న ఫర్నీచర్, కంప్యూటర్లు కాగితాల మాదిరిగా గాల్లో ఎగెరెళ్లిపోయాయి. సమీపంలో వున్న భారీ కట్టడానికి ఉపయోగించే క్రేన్ సైతం భారీ గాలుల దెబ్బకు కూలిపోయింది.


ఇక భారీ వృక్షాలు సైతం వేళ్లతో సహా పెకలించుకుపోయాయి. వేల సంఖ్యలో గుడిసెలు నేలమట్టమవ్వటమే కాకుండా కమ్యూనికేషన్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైనట్లు తెలుస్తుంది. కాగా ఫోనీ తుఫాన్ కారణంగా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా సుమారు 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా ఈ తుఫాన్ భారీ నష్టాన్ని కలిగించిందని ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments