Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకుడు మణిరత్నంపై దేశద్రోహం కేసు

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (15:49 IST)
సినీ దర్శకుడు మణిరత్నంపై దేశద్రోహం కేసు నమోదైంది. ఆయనతో పాటు 49 మందిపై ఇదే తరహా కేసు బీహార్ రాష్ట్రంలో నమోదైంది. గతంలో దేశ వ్యాప్తంగా మైనార్టీలు, దళితులు, క్రైస్తవులపై మూకదాడులు జరిగాయి. వీటిపై పలువురు సినీ సెలెబ్రిటీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మణిరత్నంతో సహా 49 మంది సినీ ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. ఇదే అంశంపై ఇపుడు ముజఫర్‌పూరులో కేసు నమోదైంది. 
 
వీరిపై దేశద్రోహ ఆరోపణలతో కేసును నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో సినీ దర్శకుడు మణిరత్నం, రామచంద్ర గుహ, అపర్ణా సేన్, శ్యామ్ బెనగళ్, అనురాగ్ కశ్యప్, సౌమిత్ర ఛటర్జీ తదితరులు ఉన్నారు. ముస్లింలు, దళితులు, ఇతర మైనార్టీలపై మూక హత్యలను వెంటనే ఆపాలని వీరు లేఖలో పేర్కొన్నారు. అసమ్మతి లేకుండా ప్రజాస్వామ్యం ఉండదని తెలిపారు. జై శ్రీరాం నినాదాన్ని రెచ్చగొట్టేందుకు ఉపయోగించే స్థాయికి దిగజార్చారని మండిపడ్డారు.
 
అయితే, ఈ లేఖపై స్థానిక న్యాయవాది సుధీర్ కుమార్ ఓఝా ముజఫర్ పూర్ కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ వీరందరిపై కేసు నమోదు చేయాలని రెండు నెలల క్రితం ఆదేశాలు జారీ చేచేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments