Webdunia - Bharat's app for daily news and videos

Install App

750 కేజీల ఉల్లి ధర రూ.1064... ప్రధాని మోడీకి ఎంవో చేసిన రైతు

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (14:09 IST)
మహారాష్ట్ర నాసిక్ జిల్లాకు చెందిన ఓ ఉల్లిరైతు వినూత్నంగా నిరసన తెలిపాడు. నాలుగు నెలల పాటు కష్టపడి పండించిన ఉల్లికి తగిన గిట్టుబాటు ధర లేదని ఆగ్రహించిన రైతు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విపత్తు నిర్వహణ శాఖకు పంటను విక్రయించగా వచ్చిన డబ్బును విరాళంగా పంపించి తన నిరసనను తెలిపాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నాసిక్‌ జిల్లాలోని నిప్‌హాద్‌ వాసి సంజయ్‌ సాఠె అనే రైతు నాలుగు నెలలు శ్రమించి 750 కిలోల ఉల్లి పండించాడు. కిలోకు ఒక రూపాయి మాత్రమే లభించడంతో ఆగ్రహించాడు. చివరకు పలు రకాలుగా బేరమాడి కిలోకు రూ.1.40కు విక్రయించారు. తద్వారా వచ్చిన రూ.1,064ను ప్రధాని మోడీకి విరాళం పంపించాడు. 
 
నిజానికి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా 2010లో భారత సందర్శనకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం 'గతిశీల రైతుల'ను గుర్తించింది. వారిని ఒబామాతో మాట్లాడించింది. అందులో సంజయ్‌ ఒకరు కావడం గమనార్హం. 
 
దీనిపై సంజయ్ మాట్లాడుతూ, నాలుగు నెలలు కష్టపడి 750 కిలోల ఉల్లి పండించా. నిప్‌హద్‌ టోకు మార్కెట్లో కిలోకు ఒక రూపాయి మాత్రమే ఇస్తానన్నారు. బేరమాడి దానిని రూ.1.40కు పెంచాను. మొత్తంగా రూ.1,064 అందుకున్నాను. నా కష్టానికి తగిన ప్రతిఫలం చూసి బాధేసింది. అందుకే నిరసనగా ప్రధాని విపత్తు నిర్వహణ శాఖకు ఆ మొత్తం పంపించాను. మనియార్డర్‌ చేసేందుకు అదనంగా రూ.54 ఖర్చుచేశాను. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మా కష్టాలపై సానుభూతి లేని ప్రభుత్వంపై కోపంతో ఇలా చేశా’ అని వెల్లడించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments