ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

సెల్వి
మంగళవారం, 29 జులై 2025 (12:14 IST)
Teacher
ప్రభుత్వ ఉపాధ్యాయులకు పని తక్కువ చేస్తారనే టాక్ వుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఏదో పని కానిచ్చేసి సమయాన్ని వృధా చేస్తారనే ఆరోపణలు ఎన్నెన్నో వున్నాయి. ఈ ఆరోపణలు నిజం అనేలా.. ప్రభుత్వ టీచర్.. సంతకం చేశామా.. జీతం తీసుకున్నామా అనే స్టైల్‌‌లో వున్నాడు. 
 
అయితే అతనికి పెట్టిన పరీక్షలో అతను చిక్కుకున్నాడు. అధికారులు స్కూల్ తనిఖీలో భాగంగా ఉపాధ్యాయుల నైపుణ్యాలను పరీక్షించే క్రమంలో ఈ ఉపాధ్యాయుడిని ELEVEN అనే పదం రాయమని కోరారు. కానీ ఆ పదాన్ని రాయలేక పట్టుబడ్డాడు. 
 
ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రూ.70,000 జీతం తీసుకుంటున్న ఒక ఉపాధ్యాయుడు, అధికారుల తనిఖీ సందర్భంగా 'ELEVEN' అనే ఆంగ్ల పదం స్పెల్లింగ్‌ను సరిగ్గా రాయలేకపోయాడు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఘటన విద్యా వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో మరింత కఠినమైన పరీక్షలు, శిక్షణ కార్యక్రమాలను అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments