Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి పెద్దిరెడ్డిని ఫిబ్రవరి 21 వరకూ ఇంటి నుంచి కదలనివ్వద్దు: ఎస్ఈసి నిమ్మగడ్డ ఆదేశం

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (13:43 IST)
ఏపీ పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వున్నాయనీ, ఆయనను ఈ నెల 21 వరకూ ఇంటి నుంచి బయటకు రానివ్వద్దని ఏపీ డిజిపికి ఆదేశాలు జారీ చేసింది.
 
ఈ సమయంలో ఆయనను మీడియాతో కూడా మాట్లాడనివ్వరాదని సూచన చేసింది. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిపేందుకు ఈ చర్య తప్పడంలేదని సీఈసి స్పష్టం చేసింది. కాగా మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం నాడు కొన్ని వ్యాఖ్యలు చేసారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలకు మేరకు నడుచుకునే అధికారులపై చర్యలు తప్పవని వైకాపా ప్రభుత్వ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఎస్ఈసీ చెప్పినట్టు నడుచుకుంటున్నారు. ఇది మంత్రి పెద్దిరెడ్డికి ఏమాత్రం రుచిచడం లేదు. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తిని పెద్దిరెడ్డి వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జిల్లా అధికారులు ఎన్నికల నిబంధనలను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. అధికారులు ఏకగ్రీవాలకు వెంటనే డిక్లరేషన్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా, చిత్తూరు, గుంటూరు జిల్లాల అధికారులు ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించాలని తెలిపారు. జిల్లా అధికారులను ఎస్ఈసీ భయపెడుతున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డ తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 
 
జిల్లా అధికారులు ఎస్ఈసీ మాటలు విని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్నంతకాలం అలాంటి అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామని అన్నారు. ఈ వ్యాఖ్యల నేపధ్యంలో సీఈసి మంత్రి పెద్దిరెడ్డిపై ఈ చర్యలకు ఆదేశించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments