Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీ ''గోత్రం''పై బీజేపీ ఓవరాక్షన్.. నెహ్రూకి ఇందిరమ్మ తలకొరివి పెట్టడంతో?

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (12:00 IST)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గోత్రంపై ప్రస్తుతం వివాదం చోటుచేసుకుంది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పుష్కర్ ఆలయానికి వెళ్లిన రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో గోత్ర నామాలు చెప్పాల్సి వుండగా, తాను కౌల్ బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి అని, తనది దత్తాత్రేయ గోత్రమని చెప్పారు. ఈ విషయంపై బీజేపీ ప్రస్తుతం రచ్చ రచ్చ చేస్తోంది. 
 
రాహుల్ గాంధీ తల్లి, మాజీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇటలీకి చెందిన వారు కావడంతో బీజేపీ కొత్తగా ''ఇట్లస్'' అనే గోత్రాన్ని సృష్టించింది. ఫిరోజ్ గాంధీని ఇందిరాగాంధీ వివాహం చేసుకున్న తరుణంలో నెహ్రూ గోత్రం రాహుల్‌కు ఎలా వచ్చిందని బీజేపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. దీంతో రాహుల్ గాంధీ గోత్రంపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాడీవేడీ చర్చ సాగుతోంది. 
 
ఈ క్రమంలో ఈ వివాదానికి పుష్కర్ ఆలయ పూజారి ఫుల్ స్టాప్ పెట్టాలని చూశారు. నెహ్రూకి మగ సంతానం లేకపోవడంతో ఆయనకి ఆమె తలకొరివి పెట్టి.. అంత్యక్రియలు చేశారని.. అందుకే నెహ్రూ గోత్రం ఇందిరకు.. ఆ తర్వాత రాజీవ్‌కు, ఆయన అనంతరం రాహుల్ గాంధీకి వచ్చిందని స్పష్టం చేశారు. దీనిపై బీజేపీ నేతలు ఎలా కామెంట్లు చేస్తారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments