Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయనిర్మలకు జగన్ పుష్పాంజలి.. వైఎస్సార్ అంటే ఎంత అభిమానమంటే?

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (11:22 IST)
ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయం ఆమె నివాసానికి వెళ్లిన జగన్ పుష్పాంజలి ఘటించారు. అనంతరం విజయనిర్మల కుమారుడు నరేశ్‌ను, సూపర్ స్టార్ కృష్ణను ఓదార్చారు. జగన్ వెంట ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉండటం గమనార్హం.  
 
ఇంకా విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ వచ్చిన వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. తన తల్లికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో అభిమానమని నటుడు నరేశ్, జగన్‌కు వివరించారు. అంతేగాకుండా ఇంట్లోని ఓ టేబుల్‌పై పూలమాలలు వేసివున్న వైఎస్ చిత్రపటాలను జగన్‌కు చూపించారు. ఈ సమయంలో జగన్ సైతం ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఇంకా నరేష్ ఓదార్చారు. 
 
కాగా, సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి, వైఎస్ కుటుంబానికీ మంచి సాన్నిహిత్యం ఉండేదన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో వైఎస్ తో చాలా దగ్గరగా ఉండేవారు. ఏలూరు నుంచి ఆయన ఎంపీగా విజయం సాధించేందుకు వైఎస్ కూడా కారణమేనని అప్పట్లో కృష్ణ చెప్పేవారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments