Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య తుది తీర్పు : సర్వత్రా ఉత్కంఠ... చీఫ్ జస్టిస్ విదేశీ పర్యటనను రద్దు

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (19:12 IST)
ఎన్నో దశాబ్దాలుగా సాగుతూ వచ్చిన అయోధ్య భూవివాద కేసుకు త్వరలో పరిష్కారం లభించనుంది. దీంతో దేశ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయోధ్య భూవివాదం కేసులో రోజు విచారణ ముగిసింది. త్వరలో తుదితీర్పును వెలువరించనుంది. ఇందుకోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ తన విదేశీ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. 
 
సుధీర్ఘకాలంగా విచారణ కొనసాగిన అయోధ్య భూవివాదం కేసులో వాద ప్రతివాదనలు పూర్తయ్యాయి. సుప్రీంకోర్టు తుది తీర్పు రిజర్వులో పెట్టింది. దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ వివాదంలో తీర్పును ప్రకటించాలన్న ఉద్దేశంతో గొగోయ్ తన విదేశీ పర్యటన విరమించుకున్నారని సమాచారం.
 
ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన 14 పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది.  జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మొత్తం నలబై రోజులుపాటు వాద ప్రతివాదనలు విన్నది.  మరో పక్క గొగోయ్ పదవీకాలం వచ్చే నెల 17న పూర్తికానుండటంతో ఈ లోపే చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments