అమావాస్యలోపు పసుపు కొమ్ములు ధరించాలా? అవన్నీ ఉత్తుత్తి వార్తలే

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (19:03 IST)
Mangalyam
కరోనా మహమ్మారి నివారణకు ముత్తైదువులు అమావాస్యలోపు ఏడు దారాలతో పసుపు కొమ్ములు ధరించి, అమావాస్య తర్వాత తీసివేయాలని చినజీయర్‌ స్వామి చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ వార్తలపై శ్రీఅహోబిల జీయర్‌ స్వామి స్పందించారు. పసుపు కొమ్ములు ధరించాలని చినజీయర్‌ స్వామి చెప్పినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ప్రచారం అవాస్తవమని తేల్చేశారు. ఎవ్వరూ ఇలాంటి వార్తలను నమ్మవద్దని సూచించారు. 
 
కరోనా వైరస్‌ కట్టడి కావాలంటే ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, భగవంతుడిని ధ్యానిస్తే మనకు మానసిక బలం చేకూరుతుందని వివరించారు. మానసిక ఒత్తిడి తగ్గడానికి భగవంతుని నామ స్మరణ చేయాలని, రోగ నివారణ కోసం వైద్య చికిత్స అవసరమని పేర్కొన్నారు.
 
చెడు ప్రభావాల నుండి బయటపడటానికి వివాహిత మహిళలు పసుపును ఒక దారంతో కట్టుకోవాలని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఈ పుకారుతో పసుపు కొనడానికి చాలామంది మహిళలు తమ ఇళ్ల నుంచి బయటికి వచ్చి షాపుల వెంట నిలబడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తమై అసలు విషయం తెలుసుకున్నారు. ఈ వార్తల్లో నిజం లేదన్నారు. తాజాగా ఇదే విషయాన్ని చినజీయర్ స్వామి కూడా పుకారేనని కొట్టిపారేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

Ajay Bhupathi: తిరుపతిలో శ్రీనివాస మంగాపురం మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

Manchu Manoj :డేవిడ్ రెడ్డి లో హీరోయిన్ గా మారియా ర్యాబోషాప్కా

Ranveer Singh: ధురంధర్ ది రివెంజ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్

సింగపూర్‌కు చేరుకున్న డిస్నీ అడ్వెంచర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments