Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి అడుగు మాత్రమే.. ముందుంది మొసళ్ళ పండుగ : మోడీకి బాబు వార్నింగ్

కేంద్రంలోని ఎన్డీయే భాగస్వామ్య ప్రభుత్వం నుంచి తమ పార్టీకి చెందిన మంత్రులు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోవడం తొలి అడుగు మాత్రమేనని, ముందుముందు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (08:32 IST)
కేంద్రంలోని ఎన్డీయే భాగస్వామ్య ప్రభుత్వం నుంచి తమ పార్టీకి చెందిన మంత్రులు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోవడం తొలి అడుగు మాత్రమేనని, ముందుముందు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముందుముందు మరిన్ని షాకులిచ్చేందుకు ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 
 
ఆయన బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి పదవుల నుంచి వైదొలగడం తొలి అడుగు మాత్రమేనని, ముందుముందు మరిన్ని కఠిన నిర్ణయాలు ఉంటాయని తేల్చి చెప్పారు. తనకు వ్యక్తిగత ప్రయోజనాలు అవసరం లేదని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ముఖ్యమని పునరుద్ఘాటించారు. 
 
ఎన్డీయే సర్కారు నుంచి తమ మంత్రులు రాజీనామా చేస్తారని, ప్రస్తుతానికి కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలిగే టీడీపీ, ఎన్డీయేలో మాత్రం కొనసాగుతుందని వెల్లడించారు. సంయమనం పాటిస్తూ ప్రయోజనాలను సాధించుకోవాలన్నది తన అభిమతమని, కేంద్రంపై మరింత ఒత్తిడి పెడుతూనే, సానుకూల నిర్ణయాలు వెలువడితే కలిసుంటామని లేనిపక్షంలో ఎన్డీయే కూటమి కూడా రాంరాం పలుకుతామని తేల్చి చెప్పారు. 
 
ఏం ప్రయోజనాలు ఆశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాని కార్యాలయం చుట్టూ తిరుగుతుందో తనకు తెలుసునని, ఏ ఉద్దేశంతో వారు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చారో వెల్లడించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments