Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాజపాను ఏపీలో సమాధి చేస్తారు : బొండా ఉమామహేశ్వర రావు

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సమాధి చేసినట్టు వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని సమాధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు జోస్యం చెప్పారు.

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (14:01 IST)
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సమాధి చేసినట్టు వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని సమాధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు జోస్యం చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కుటిల రాజకీయాలను దేశం మొత్తం కూడా వ్యతిరేకించే పరిస్థితి వచ్చిందన్నారు. 
 
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన మోసం బయటపడుతుందనే అవిశ్వాసంపై చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు. కేంద్రానికి రాష్ట్ర బీజేపీ కూడా వంత పాడుతోందని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీపైన లేదా? అని ప్రశ్నించారు. 
 
భాజాపా నేత విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసే రీతిలో మాట్లాడుతున్నారని.. రాంమాధవ్‌, హరిబాబు రాష్ట్రంపై యుద్ధంచేస్తామంటున్నారని వీరందరినీ ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొంటామని చెప్పారు. జనసేన అధినేత పవన్‌కు నాలుగేళ్ల తరువాత ప్రభుత్వంలో అవినీతి కనపడుతోందా? అని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments