Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు సంవత్సరాలుగా కరెంట్ బిల్లు చెల్లించని బీజేపీ ఎంపీ?

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (18:56 IST)
మనం ఒక్క నెల కరెంటు బిల్లు చెల్లించకుంటే ఫైన్ వేసి మరీ మరుసటి నెలలో చల్లిస్తాము. అయితే ప్రజాప్రతినిధుల వ్యవహారం వేరేలా ఉంటుంది. వారు తమ ప్రాబల్యంతో కరెంటు ఛార్జీలు చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటిదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫరుకాబాద్ బీజేపీ ఎంపీ ముకేష్ రాజ్‌పూత్ ఇలాంటి ఘనకార్యమే చేసాడు. 
 
ఈ విషయం అయ్యగారు ఎలక్షన్ నామినేషన్ వేసేటప్పుడు బయటకు వచ్చింది. ఫరుకాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ముకేష్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసే క్రమంలో విద్యుత్‌శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి వచ్చింది. కాగా గత ఏడు సంవత్సరాలుగా ముకేష్ విద్యుత్ బిల్లులు చెల్లించని కారణంగా విద్యుత్ శాఖకు లక్షల్లో బకాయిపడ్డాడు. 
 
నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా వారిని కోరగా బిల్లు చెల్లింపులు చేస్తేనే ఇస్తామని చెప్పడంతో సదరు ఎంపీ ఇంజినీర్‌కు ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ బెదిరింపుల ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంపీ బెదిరింపులపై ఇంజినీర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments