Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాజం పాలిట బీజేపీ ప్రమాదకరంగా మారుతోంది : ప్రకాష్ రాజ్

భారతీయ జనతా పార్టీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ కత్తికట్టినట్టున్నారు. ఈనెల 12వ తేదీన జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని ఆయన కన్నడ ఓటర్లకు పిలుపునిచ్చారు.

Webdunia
గురువారం, 10 మే 2018 (09:06 IST)
భారతీయ జనతా పార్టీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ కత్తికట్టినట్టున్నారు. ఈనెల 12వ తేదీన జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని ఆయన కన్నడ ఓటర్లకు పిలుపునిచ్చారు. అదేసమయంలో తాను ఫలానా పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరడం లేదనీ, కేవలం బీజేపీని ఓడించాలని మాత్రమే కోరుతున్నట్టు చెప్పారు.
 
అలా ఎందుకు పిలుపునిస్తున్నానో కూడా ఆయన వివరణ ఇచ్చారు. బీజేపీ సమాజం పాలిట ప్రమాదకరంగా తయారవుతోంది. ఒక కులం, ఒక మతం మాత్రమే దేశాన్ని ఏలాలనే సిద్ధాంతంతో పనిచేస్తోంది. అధికారంలోకి రావడానికి కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతోంది. నేను హిందూయిజానికి వ్యతిరేకిని కాదు. కానీ, బీజేపీ చేష్టలతో హిందూయిజానికి ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాను అని వివరించారు. 
 
ఇదే పంథాను కొనసాగిస్తా.. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తా. మోడీ నుంచి దేశాన్ని కాపాడేందుకు నాలాంటి చౌకీదార్లు ఎందరో తయారవుతున్నారు. వారిని ఏకతాటిపైకి తీసుకొస్తా. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల్లో నా బాటలో 3 వేల మంది తయారయ్యారు. మాస్‌, క్లాస్‌ అని తేడా లేకుండా అందరినీ కలుపుకొని వెళ్తున్నా. మాస్‌ గల్లీలో ప్రచారం చేస్తే.. క్లాస్‌ సోషల్‌ మీడియాలో చేస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments