Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధానిపై పోరుబాట : 16న జనసేన - బీజేపీ కీలక భేటీ

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (14:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అమరావతి రాజధాని మార్పు తదితర అంశాలను బీజేపీ పెద్దల దృష్టికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు. పవన్ తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై బీజేపీ కేంద్ర నాయకత్వం తక్షణం స్పందించింది. ఇందులోభాగంగా, ఈనెల 16వ తేదీన విజయవాడ కేంద్రంగా జనసేన - బీజేపీ నేతల సమన్వయ సమావేశం జరుగనుంది. అమరావతి రాజధాని ఉద్యమం ఏపీలో ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్న నేపథ్యంలో దీనిపై ఇరు పార్టీల నేతలు గురువారం చర్చించనున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ సమావేశానికి బీజేపీ అధిష్టానం తరపున సునీల్ డియోరాతోపాటు మరో సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలు రాష్ట్రానికి రానున్నారు. అలాగే, జనసేన పార్టీ తరపున అధినేత పవన్ కళ్యాణ్, సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌లు పాల్గొననున్నారు. 
 
ఈ సమన్వయ భేటీపై స్పందిస్తూ, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ స్పందించారు. రాష్ట్ర అభివృద్ధిపై తమ పార్టీ మొదటి నుంచి ఒకే మాటపై ఉందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామన్నారు. ఏపీ సీఎం మారినప్పుడల్లా రాజధానిని మార్చడం సరికాదన్నారు. కాగా, జనసేన - బీజేపీ సమన్వయ భేటీలో ఇరు పార్టీల నేతలు ఏయే విషయాలపై చర్చిస్తారన్న అంశంపై ఇపుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments