రాజధానిపై పోరుబాట : 16న జనసేన - బీజేపీ కీలక భేటీ

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (14:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అమరావతి రాజధాని మార్పు తదితర అంశాలను బీజేపీ పెద్దల దృష్టికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు. పవన్ తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై బీజేపీ కేంద్ర నాయకత్వం తక్షణం స్పందించింది. ఇందులోభాగంగా, ఈనెల 16వ తేదీన విజయవాడ కేంద్రంగా జనసేన - బీజేపీ నేతల సమన్వయ సమావేశం జరుగనుంది. అమరావతి రాజధాని ఉద్యమం ఏపీలో ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్న నేపథ్యంలో దీనిపై ఇరు పార్టీల నేతలు గురువారం చర్చించనున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ సమావేశానికి బీజేపీ అధిష్టానం తరపున సునీల్ డియోరాతోపాటు మరో సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలు రాష్ట్రానికి రానున్నారు. అలాగే, జనసేన పార్టీ తరపున అధినేత పవన్ కళ్యాణ్, సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌లు పాల్గొననున్నారు. 
 
ఈ సమన్వయ భేటీపై స్పందిస్తూ, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ స్పందించారు. రాష్ట్ర అభివృద్ధిపై తమ పార్టీ మొదటి నుంచి ఒకే మాటపై ఉందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామన్నారు. ఏపీ సీఎం మారినప్పుడల్లా రాజధానిని మార్చడం సరికాదన్నారు. కాగా, జనసేన - బీజేపీ సమన్వయ భేటీలో ఇరు పార్టీల నేతలు ఏయే విషయాలపై చర్చిస్తారన్న అంశంపై ఇపుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

తర్వాతి కథనం
Show comments